బీసీ కాలనీలో మౌలిక వసతుల లేమి
పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు.
వింజమూరు, న్యూస్టుడే : పంచాయతీ పరిధిలో రెండు వార్డులున్న బీసీ కాలనీ అనేక సమస్యలతో సతమతవుతోంది. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. వీధులకు సిమెంటు రోడ్లు లేవు. కొన్ని వీధులకు ఉన్నా వాటికి అనుగుణంగా మురుగు కాలువలు లేవు. ఇళ్లలో మురుగునీటి కోసం గుంతలు తవ్వుకుని వాటిలోకి వృథా జలాన్ని పంపిస్తున్నారు. అవి నిండితే వాహనాల ద్వారా బయటకు తరలిస్తున్నారు. కాలనీలో ఎవరిని కదిలించినా వీధి కాలువల సమస్యే చెబుతున్నారు. గతంలో ఏర్పాటు చేసిన సిమెంటు రోడ్లే ఉన్నాయి. ఇటీవల కాలంలో రోడ్డు, కాలువలు తదితర అభివృద్ధి పనులు కనిపించటంలేదు. కాలనీలో ఎగువ ప్రాంతాల వారికి నీరందక తాగునీటికి కటకటలాడుతున్నారు. శ్మశానానికి స్థలం కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
వింజమూరు-చాకలకొండ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వర్షాకాలంలో గ్రామస్థుల అవస్థలు వర్ణనాతీతం. వీధిదీపాలు సక్రమంగా వెలగడంలేదు. 20వ వార్డు బొమ్మరాజుచెరువు, జీబీకేఆర్ గిరిజన కాలనీలోనూ అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
అభివృద్ధికి నోచుకోలేదు
కాలనీలో ఐదారేళ్ల క్రితం చేసిన పనులు తప్ప కొత్తగా అభివృద్ధి ఏమీలేదు. కాలనీ సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదు. తాగునీరు, మురుగు కాలువలు, అపారిశుద్ధ్యంపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. కొన్నిచోట్ల సిమెంట్లు రోడ్లు నిర్మించినా వాటికి అనుగుణంగా వీధి కాలువలు లేవు. మురుగునీరు రోడ్లపై నిల్వ ఉంటోంది. పాఠశాల పరిసరాలు అధ్వానంగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ