భూ భక్షణ చట్టం
ల్యాండ్ టైటిలింగ్ చట్టం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం.
న్యూస్టుడే, కందుకూరు పట్టణం, నెల్లూరు (లీగల్), (స్టోన్హౌస్పేట), ఉదయగిరి
ల్యాండ్ టైటిలింగ్ చట్టం. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అరాచక చట్టం కొత్తకష్టాలు తెచ్చిపెట్టింది. ఆక్రమణలకు పట్టం కట్టేలా ఉంది. మున్ముందు భూ రక్షణకు, ఆస్తుల భద్రతకు చెల్లుచీటి పలికే దీన్ని ఊహించుకుంటేనే భయానకం. రాబందుల రాజ్యంలో సామాన్యులకు భూ హక్కు ప్రశ్నార్థకమే. నిరక్షరాస్యులు, చిన్న-సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఎవరివైనా ఆస్తులు కబ్జాకు గురైతే.. తామే యజమానులమని నిరూపించుకునేందుకు పరీక్ష పెట్టిందీ వైకాపా సర్కారు.
‘వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం లోప భూయిష్టంగా ఉంది. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఈ చట్టంతో ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని’ పలువురు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇది రైతులకు ఇబ్బందికరమైన చట్టమనీ, ఈ చట్టంతో భూ వివాదాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రజలు తమకు తెలియకుండానే వారి ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉందనీ, దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ గతంలో తాము ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు.
చట్టబద్ధత లేని అంశాలే ఎక్కువ
-సీహెచ్ హరికృష్ణ, న్యాయవాది
భూ యాజమాన్య హక్కుల చట్టం లొసుగులమయంగా ఉంది. విచారణ అధికారాన్ని సివిల్ కోర్టుల నుంచి తప్పించి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి అప్పగించడం వివాదాలకు దారితీస్తోంది. చట్టంలో ఉన్న పరిపాలన విధానం చాలా తప్పుగా ఉంది. చట్టబద్ధత లేని అంశాలే ఈ చట్టంలో ఎక్కువగా ఉన్నాయి. సెంట్రల్ యాక్టును దృష్టిలో పెట్టుకోకుండా మన రాష్ట్రంలో ఈ చట్టాన్ని తయారు చేశారు. దీంతో వ్యక్తుల ఆస్తులకు విఘాతం కలుగుతోంది.
అభూత కల్పన చట్టమిది
-పి.భాస్కర్రావు, న్యాయవాది
ప్రభుత్వం తీసుకొచ్చింది అభూత కల్పన చట్టం. రాష్ట్రంలో చాలా కోర్టులు, న్యాయవాదులు, న్యాయమూర్తులున్నారు. అంతమంది ఉన్నా.. భూ సమస్యలను కేవలం రెవెన్యూ అధికారులతో పరిష్కరిస్తామనీ, ఈ చట్టాన్ని తీసుకురావడం దారుణం. క్రయవిక్రయాల అనంతరం రికార్డుల్లో ఎవరి పేరుందో రెండు సంవత్సరాల్లోగా తెలుసుకోకపోతే ఆస్తి కోల్పోయినట్లే. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కింది కోర్టులకు వెళ్లడానికే కక్షిదారులకు ఇబ్బందిగా ఉంటే.. ఇక హైకోర్టుకు వెళ్లాలనడం దారుణం. ఎటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం అమలు చేయకూడదు. దీన్ని అమలు చేయకుండా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాం.
ఆస్తులు కోల్పోతారు
-వలేటి శ్రీధర్నాయుడు, న్యాయవాది
టైటిలింగ్ యాక్టు వల్ల స్థిరాస్తులను ప్రజల నుంచి దూరం చేయడమే అవుతుంది. టైటిలింగ్ అధికారాన్ని అధికారుల చేతికిస్తే.. అధికార పార్టీ నాయకులకే పెత్తనం అప్పగించడం అవుతుంది. అప్పుడు కేవలం ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికే న్యాయం జరుగుతుంది. చట్టం అమలైతే భూ సమస్యలున్న వారు న్యాయస్థానాలకు వెళ్లినా సరైన న్యాయం జరగకపోవచ్చు. ఈ చట్టం రద్దు చేస్తేనే సామాన్యులకు మేలు జరుగుతుంది. ఈ చట్టాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
చిన్న, సన్నకారు రైతులకు సాధ్యమా?
-ఆర్.రమేష్, న్యాయవాది
ఈ చట్టం ద్వారా రిజిష్టర్లో ఒకసారి భూహక్కు దారుని పేరు నమోదైన తరువాత ఈ భూములపై ఎవ్వరు కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబోయే, జిల్లా ట్రైబ్యునల్స్లోనే తేల్చుకోవాల్సి ఉంది. జిల్లా ట్రైబ్యునల్లో న్యాయం జరగలేదనుకున్నప్పుడు తీర్పు వెలువడిన 15రోజుల్లో రాష్ట్ర స్థాయి ట్రైబ్యునల్లో అప్పీలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత హైకోర్టులో భూహక్కును నిర్ధారించుకోవాల్సి వస్తుందని ఈ చట్టం చెబుతోంది. ఇది చిన్న, సన్నకారు, దళిత, బీసీ వర్గాల ప్రజలకు ఆచరణ సాధ్యంకాదు.
అధికార పార్టీ చెప్పుచేతల్లోనే..
-ఎస్కె.రియాజ్బాషా, న్యాయవాది
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రికార్డు సృష్టించడానికి, అధికారం కేవలం టైటిలింగ్ అధికారి చేతుల్లోనే ఉంటుంది. తద్వారా గత రికార్డులకు సంబంధించి సాక్ష్యంగా ఉన్న విలువలను రద్దు చేస్తుంది. పనికిమాలిన వివాదాలను సృష్టిస్తూ నిజమైన భూహక్కు దారులను హింసించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. చట్టం వల్ల భూహక్కుదారులకు నష్టం జరిగి, అధికార పార్టీ రాజకీయ దళారి కబ్జాదారులు, సెటిల్మెంట్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఆగడాలకు హద్దు, అదుపు ఉండదు.
చర్చే లేకుండా అమలా!
-కె.వి.లక్ష్మీనారాయణ, న్యాయవాది
చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు రాష్ట్రంలోని మేధావులు, న్యాయ నిపుణులతో కనీసం ఒక సెమినార్ నిర్వహించలేదు. కేంద్ర ప్రభుత్వంపై నెపం పెడుతున్నారు. కానీ, వారు ఇప్పటికే మూడుసార్లు తిరస్కరించారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తర్వాత మన రాష్ట్రంలోనే ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ చట్టంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటే వారిని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అధికార పార్టీకి మద్దతు తెలిపే న్యాయవాదులు కూడా ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారసత్వాన్ని అధికారులే నిర్ణయించడం దారుణం.
చట్టం.. లోపభూయిష్టం
-ఎస్ రామారావు, న్యాయవాది, ఉదయగిరి
ల్యాండ్ టైటిలింగ్ చట్టం లోపభూయిష్టంగా ఉంది. దీన్ని అమలు చేస్తే సివిల్ కోర్టులు రద్దయ్యే అవకాశం ఉంది. ఈ చట్టం ద్వారా భూములకు సంబంధించిన వ్యవహారమంతా టీఆర్వో వద్దనే ఉంటాయి. చివరికి సదరు భూయజమానులకు ఒక జెరాక్సు కాపీలు మాత్రమే చేతిలో ఉంటుంది. వారసత్వ ఆస్తిని కూడా సరైన సమయంలోగా యజమాని తన పేరుతో నమోదు చేసుకోవాలి. లేకుంటే ఆ భూమిని ప్రభుత్వమే లాక్కునే ప్రమాదం ఉంది. అలాగే భూయజమాని రెండేళ్ల లోపు ఆ భూమి తమదేనని నిరూపించుకోకుంటే కోల్పోయే పరిస్థితి భూహక్కు చట్టంలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణారెడ్డే కావలికి కాబోయే ఎమ్మెల్యే: మాలేపాటి
[ 19-05-2024]
కావలి నియోజకవర్గ కేంద్రంలో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్