అయిదేళ్ల పాలన.. ఆటలకేదీ ఆలన?
క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు.
వైకాపా ప్రభుత్వంలో ఒక్క పథకమూ లేదు..
క్రీడా భవితను కోల్పోయిన క్రీడాకారులు
న్యూస్టుడే, నెల్లూరు (క్రీడా విభాగం)
క్రీడాకారులకు జిల్లా పెట్టింది పేరు.. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించారు. వైకాపా ప్రభుత్వ పుణ్యమాని క్రీడాభివృద్ధికి ఎలాంటి పథకాలు అందజేయలేదు. ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. గత ప్రభుత్వం క్రీడాకారుల కోసం ‘డే బార్డర్’, ‘గాంఢీవం’, ‘పాంచజన్య’ వంటి పథకాలు ప్రవేశపెట్టి పాఠశాల స్థాయి నుంచే క్రీడలను అభివృద్ధి చేసింది. వైకాపా ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. క్రీడా వికాస కేంద్రాలు, అకాడమీలు, మైదానాలు.. ఇలా ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అయిదేళ్లలో జిల్లాలో క్రీడల పరంగా ఒరిగిందేమి లేదు.
పూరించని పాంచజన్యం..
ఒలింపిక్స్లో రాష్ట్రం తరఫున క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో అర్జునుడి విల్లు ‘గాంఢీవం’ పేరుతో వినూత్న పథకం, ఆర్థికంగా క్రీడలకు దూరమవుతున్న వారిని గుర్తించి వారికి మంచి పౌష్టికాహారంతో పాటు నిపుణులచే ఉచితంగా శిక్షణ ఇచ్చేలా ‘డే బార్డర్’, జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేలా చేసేందుకు ‘పాంచజన్య’ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. పాఠశాలల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి వారిని నైపుణ్యాలు కలిగిన శిక్షకులతో శిక్షణ ఇప్పించే వారు. ఇలా నియోజకవర్గాల వారీగా పాఠశాలలను ఎంపిక చేసేవారు. దాంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో ఉంటూ ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని గుర్తించి వారికి ప్రతి నెలా ఆర్థిక సాయం చేసేవారు. రాష్ట్రంలో మంచి పేరున్న శిక్షకులతో శిక్షణ ఇప్పించేవారు. అయిదేళ్లలో క్రీడాకారులకు అవసరమైన ఇలాంటి ఒక్క పథకం అమలు చేయలేదు.
ప్రభుత్వంలో పే అండ్ ప్లే..
మైదానంలో ఆడేందుకు ప్రభుత్వం పే అండ్ ప్లే అనే నినాదాన్ని ప్రవేశపెట్టింది. దీంతో చాలా మంది క్రీడాకారులు క్రీడలకు దూరమయ్యారు. గత ప్రభుత్వంలో కేవలం స్విమ్మింగ్ ఫూల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల నిర్వహణకు నామమాత్రపు రుసుము వసూలు చేసేది. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా మైదానానికే రుసుం వసూలు చేస్తోంది. ఒక్కో క్రీడాకారుని వద్ద క్రీడను బట్టి రుసుము వసూలు చేస్తున్నారు. మైదానంలో ఫుట్బాల్, బేస్బాల్, వాలీబాల్ తదితరాలు క్రీడలు ఆడాలంటే రుసుము చెల్లించాల్సిందే.
దిష్టిబొమ్మలా క్రీడా వికాస కేంద్రాలు..
గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికి తీసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా వికాస కేంద్రాలు.. ఒక్కటీ ప్రారంభానికి నోచుకోలేదు. నియోజకవర్గానికి ఒకటి క్రీడా మైదానం చొప్పున నాటి ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించింది. స్థల సేకరణ జరిగింది. పూర్తయితే నియోజకవర్గాల వారీగా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చేవారు. ఉమ్మడి జిల్లాకు పది కేవీకేలు మంజూరయ్యాయి. ఒక్కటీ ప్రారంభానికి నోచుకోలేదు.
అకాడమీలేవీ..?
క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతో పాటు పౌష్టికాహారం అందిస్తూ పోటీలకు సిద్ధం చేసే అకాడమీలు అయిదేళ్లలో ఒక్కటీ లేదు. క్రీడాపరంగా అభివృద్ధి చెందిన జిల్లా జిల్లాకు అకాడమీలు కేటాయించకపోవడం దారుణం. గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో ఆరు అకాడమీలు ఏర్పాటు చేసి క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించారు. దాంతోపాటు బాలికల కోసం రూ.2కోటË్లతో నిర్మించతలపెట్టిన భవనం నేటికీ పూర్తి కాలేదు. ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం ఆవరణంలో దీన్ని ఏర్పాటుకు నిర్ణయించారు. ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉంది.
ప్రారంభానికి దూరం.. మొగళ్లపాలెం ఇండోర్ స్టేడియం
రూ.8 కోట్లతో నెల్లూరు గ్రామీణం మొగళ్లపాలెంలో నిర్మించిన బహుళ ఇండోర్ మైదానం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 150 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. 2018లో పనులు ప్రారంభించారు. సుదీర్ఘ కాలం అనంతరం గత ఏడాది పనులు పూర్తయినట్లు ప్రకటించినా.. ఇంత వరకు క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురాలేదు.
ఏళ్లుగా ప్రతిపాదనలు
ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం
జిల్లాకే తలమానికమైన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానం అభివృద్ధికి ఏళ్ల నుంచి ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయి. అయిదేళ్ల నుంచి మైదానానికి అవసరమైన అన్ని రకాల ప్రతిపాదనలు అధికారులు నివేదిస్తున్నా.. నేటికి ఒక్కటీ మంజూరు కాలేదు. సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో బాస్కెట్ బాల్, ఫుట్బాల్, హాకీ, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, జూడో తదితర 12 క్రీడాంశాలకు సంబంధించి మైదానాలు ఉన్నాయి. వీటికి కావల్సిన వసతులు లేవు. హాకీ మైదానానికి సంబంధించి ఫెన్సింగ్ కావాలని అధికారులు వేడుకుంటున్నా.. మంజూరు చేయలేదు. దాంతో పాటు ప్రతి క్రీడా మైదానానికి క్రీడాకారుల కోసం డ్రస్సింగ్ రూమ్ కావాలని నివేదించారు. దాని ఊసే లేదు. ఇక స్కేటింగ్ క్రీడకు సంబంధించి రింక్ కావాలని దరఖాస్తులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో క్రీడాకారులు తీవ్ర నష్టపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణారెడ్డే కావలికి కాబోయే ఎమ్మెల్యే: మాలేపాటి
[ 19-05-2024]
కావలి నియోజకవర్గ కేంద్రంలో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు