వడదెబ్బకు తల్లీతనయుడి మృతి
నిరుపేద కుటుంబం...సరైన పోషణ లేదు. ఆపై వృద్ధాప్యం నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఇంటిలోనే తల్లీతనయులు ఒకేసారి మృతిచెందారు. ఈ సంఘటన దువ్వూరు గ్రామంలో వెలుగుచూసింది. ఎవరూ గుర్తించకపోవటంతో వారి మృతదేహాలు మూడు రోజులపాటు ఇంటిలోనే ఉన్నాయి.
సంగం, న్యూస్టుడే: నిరుపేద కుటుంబం...సరైన పోషణ లేదు. ఆపై వృద్ధాప్యం నేపథ్యంలో వడదెబ్బ కారణంగా ఇంటిలోనే తల్లీతనయులు ఒకేసారి మృతిచెందారు. ఈ సంఘటన దువ్వూరు గ్రామంలో వెలుగుచూసింది. ఎవరూ గుర్తించకపోవటంతో వారి మృతదేహాలు మూడు రోజులపాటు ఇంటిలోనే ఉన్నాయి. గ్రామానికి చెందిన రమణమ్మ(80), తన కుమారుడు అవివాహితుడైన శ్రీనివాసులురెడ్డి(60)తో కలసి నివసిస్తున్నారు. దువ్వూరు- మక్తాపురం రహదారి సమీపంలో వారి నివాసగృహం ఉంది. వయోభారానికి తోడు వారికి సరైన పోషణ లేదు. దాంతో వారిద్దరూ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని గ్రామస్థులు తెలిపారు. మూడు రోజులుగా వారు ఎవరికీ కనిపించలేదు. ఎండ తీవ్రత కారణంగా ఎవరూ గమనించలేదు. మంగళవారం రాత్రి వారింటిలో దీపం వెలగనందున చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా వారిద్దరూ మృతి చెందినట్లు కనుగొన్నారు. మృతదేహాల తీరుతెన్నులను గమనించిన గ్రామస్థులు తొలుత శ్రీనివాసులురెడ్డి, ఆ తరువాత ఆయన తల్లి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. తనయుడి మృతదేహం వద్ద ఆమె పడిపోయి ఉంది. ఆమె చేతిలో బియ్యం ఉన్నాయి. కుమారుడు మృతి చెందారని తెలుసుకున్న ఆమె ఆయన కళ్లు కప్పేందుకు బియ్యం తీసుకు వచ్చి తాను కూడా ఊపిరి వదిలినట్లు భావిస్తున్నారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు గురై ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బుధవారం వారిద్దరి అంత్యక్రియలను బంధువులు ఒకేసారి నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం