అయిదేళ్లలో మోదీకి వారంతా మద్దతు
కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న విధానాలు సమర్థిస్తూ.. ఆయన ఒత్తిడికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం, తెదేపా, జనసేనలు పనిచేస్తున్నాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సీపీఎం పోలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
మాట్లాడుతున్న బీవీ రాఘవులు
నెల్లూరు(విద్య), న్యూస్టుడే: కేంద్రంలో మోదీ అవలంబిస్తున్న విధానాలు సమర్థిస్తూ.. ఆయన ఒత్తిడికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం, తెదేపా, జనసేనలు పనిచేస్తున్నాయని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘వీరు మోదీ విధానాలు అమలు చేయడం తప్ప.. వ్యతిరేకించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైకాపా, తెదేపా, జనసేనలు అడగలేదు. ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా చంద్రబాబు మోదీ చెంతన చేరారు. రాజధాని మూడుచోట్ల అంటూ వైకాపా మూడు ముక్కలాట ఆడుతుంటే జగన్పై మోదీ ఒత్తిడి చేయకుండా వ్యవహరించారు. మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తే వ్యతిరేకించింది ఇండియా కూటమి... అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తుంది. రైతులకు గిట్టుబాటు ధర ఇండియా కూటమి అడుగుతోంది.. వైకాపా, తెదేపా, జనసేన అడగటంలేదు. సీపీఎం తరఫున నెల్లూరు అభ్యర్థిగా మూలం రమేష్, ఎంపీగా ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి రాజుని గెలిపించాలి’ అని కోరారు. సీపీఎం నెల్లూరు నగర అభ్యర్థి మూలం రమేష్, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న ఐదో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం