కాలనీల్లో కష్టాలు.. ఇంకా ఎన్నాళ్లు?
పట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
న్యూస్టుడే, కందుకూరు పట్టణం
పట్టణంలోని పలు కాలనీలు కీలకమైన మౌలిక వసతుల లేమితో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వైకాపా ప్రభుత్వం వచ్చాక కాలనీల్లో కనీస సౌకర్యాలు కల్పించే నాధులే లేకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, కాలువలు వంటి వాటి గురించి పట్టించుకుంటున్న దాఖలాల్లేకపోవడం వైకాపా పాలనకు నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రమంతటా గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో వైకాపా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి తిరిగి సమస్యలు గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఒక్కో సచివాలయానికి రూ.20లక్షలు చొప్పున కేటాయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా కార్యాచరణ సిద్ధం చేశారు. కానీ, రాష్ట్రంలో దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో జరిగినా కందుకూరు మున్సిపాలిటీలో మాత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించలేదు. దీంతో నిధుల మంజూరు సంగతి అటుంచి కనీసం సమస్యలు గుర్తించిన వారే లేకపోవడం పట్ల ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్లపైనే మురుగు ప్రవాహం
పట్టణంలోని 17, 18, 19, 20 వార్డుల పరిధిలో మంగళిపాలెం, వినాయకస్వామిగుడి ప్రాంతం, కాళిదాసువారివీధి, పాత ఆంధ్రాబ్యాంకు బజారు తదితర ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య నెలకొంది. మంగళిపాలెంలో తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణమంతా ఉదయం పూట సరఫరా అవుతుంటే.. మంగళిపాలెంలో మాత్రం సాయంత్రం 6 తరువాత సరఫరా చేస్తున్నారు. అది కూడా పట్టుమని పది బిందెలు రావడం లేదంటున్నారు. కాళిదాసువారివీధిలో చెత్త సమస్య తీరడం లేదు. కాలువలు సక్రమంగా లేక మురుగునీరు నిల్వ ఉంటోంది. కొన్ని వీధుల్లో రామతీర్థం పైపులైన్లు, కుళాయిల కోసం రోడ్డును పగలగొట్టారు. మరలా కాంక్రీటుతో మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆయా వీధులు గతుకులమయంగా ఉన్నాయి. మంగళిపాలెం నుంచి బైపాస్రోడ్డుకు వెళ్లే వీధుల్లో కాలువలు, చప్టాలు పగిలి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారాయి. ఆయా వార్డులన్నిటిలో మురుగు కాలువల సమస్య తీవ్రంగా ఉంది.
నీరు సరిగా రావడం లేదు
-మాలతి, మంగళిపాలెం
మాకు సాయంత్రం 6 తరువాత రామతీర్థం నీరు సరఫరా అవుతోంది. చాలా కాలం నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు. ఇటీవల అయితే పది బిందెలు కూడా రావడం లేదు. ఎండాకాలం కావడంతో నీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కో రోజు నీళ్లు వాసన వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే ప్రజాస్వామ్యం
[ 20-05-2024]
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని జనరల్ మర్చంట్ వ్యాపారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకట శేషారెడ్డి అన్నారు. -
హ్యాపీసేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
[ 20-05-2024]
కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నెలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ