సమస్యల వాడలు.. పట్టని పాలకులు
పట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు.
న్యూస్టుడే, కావలి
పట్టణంలోని పాతూరుతో సహా సమీప ప్రాంతాల్లోని వార్డుల్లో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. ఛిద్రమైన రహదారులు.. పూడికతో నిండిన కాలువలతో నిత్యం పడరాని పాట్లు పడుతున్నారు. పాలకులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కాలం చెల్లిన పైపులైన్లు తరచూ లీకులు పడడంతో నీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. ఖాళీ ప్లాట్లలో ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరగడంతో విషపురుగులు చేరుతున్నాయి. 5,6,7 వార్డుల్లోకి వచ్చే పాతూరు, ఈతకోటవారి వీధి, వెంగాయగారిపాలెం, కొనదిన్నె గిరిజన కాలనీల్లో మురుగుకాలువల్లో ప్రవాహం ముందుకెళ్లడం లేదు. ఇటీవల రూ.40 లక్షల వంతున ఒక్కో సచివాలయానికి నిధులు మంజూరుచేశారు. వీటితో చేస్తున్న పనుల్లో నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంగాయగారిపాలెం, కొనదిన్నె గిరిజన కాలనీల్లో వీధి కుళాయిలే లేవు.
8,9,10,11 వార్డుల పరిధిలో షాదీమంజిల్, వివేకానంద పార్కు, అళహరివారి వీధి, గంగమ్మ ఆలయ కూడలి, శివాలయం వీధి, ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు నిత్యం హాజరుకావడం లేదనే విమర్శలున్నాయి. రోడ్లను శుభ్రం చేసి చాన్నాళ్లవుతుందంటున్నారు. దీంతో చెత్తకుప్పలతో దుర్వాసన వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కొన్ని వీధుల్లో రోడ్లకు పక్కనే పిచ్చి మొక్కలు మొలిచాయి. దోమల బెడద అధికంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దోమల సమస్యకు పరిష్కారం చూపాలి
-పోలు వెంకటేశ్వర్లు, పాతూరు
దోమల సమస్యకు పరిష్కారం చూపాలి. అన్ని కాలనీల్లో ఈసమస్య ఉంది. వీటితో వ్యాధులకు గురవుతున్నాం.
పారిశుద్ధ్యం మెరుగుపరచాలి
-ఈవీఎస్ రామారావు, ఎస్పీ కాలనీ
చాలా వీధుల్లో మాత్రం పారిశుద్ధ్య సిబ్బంది విధులకు హాజరుకావడం లేదు. నిత్యం కాలువల్లో పూడిక తీయడంతో పాటు చెత్త శుభ్రం చేయడం లేదు. వీరిపై పర్యవేక్షణ పెంచాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాతోనే ప్రజాస్వామ్యం
[ 20-05-2024]
రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం ఫరిడవిల్లిందని జనరల్ మర్చంట్ వ్యాపారుల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు జెట్టి వెంకట శేషారెడ్డి అన్నారు. -
హ్యాపీసేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
[ 20-05-2024]
కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నెలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల