తెదేపాలో పలువురి చేరికలు
కావలి రూరల్ మండలం గౌరవరంకు చెందిన ముగ్గురు వైకాపా వార్డు మెంబర్లతో సహా పలువురు ముఖ్య నేతలు తెదేపాలో చేరారు.
కావలి: కావలి రూరల్ మండలం గౌరవరంకు చెందిన ముగ్గురు వైకాపా వార్డు మెంబర్లతో సహా పలువురు ముఖ్య నేతలు తెదేపాలో చేరారు. శుక్రవారం గౌరవరంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వార్డు మెంబర్ కూసిపాటి సుభాష్ చంద్ర, కే.రాఘవేంద్ర, పోట్లూరి కోటయ్య లతో పాటు దేవరపల్లి పుల్లయ్య, కూసిపాటి యానాది, గంగుల సుమన్, శెట్టిపల్లి అన్నమయ్య, ఏ.ప్రశాంత్, కామేశ్వరరావు, టి. మాల్యాద్రి, శ్రీకాంత్ పార్టీలో చేరారు. వీరికి ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గౌరవరం నాయకులు సూరే శ్రీనివాసులు రెడ్డి, మేదరమిట్ల శ్రీనివాసులు రెడ్డి, మేదరమిట్ల ఈశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హ్యాపీసేవా సంస్థ ఆధ్వర్యంలో గిరిజనులకు భోజనం ప్యాకెట్ల పంపిణీ
[ 20-05-2024]
కావలి రూరల్ మండలంలోని ఆముదాలదిన్నెలో హ్యాపీ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిరుపేద గిరిజనులకు భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. -
సోమశిల.. ఈ నిర్లక్ష్యమేల!
[ 20-05-2024]
ఇది ఫ్యూజో మీటరు.. సోమశిల జలాశయం మట్టికట్ట స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకునే ఈ వ్యవస్థ దశాబ్దానికి పైగా పనిచేయడం లేదు. నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో మట్టికట్టపై పర్యవేక్షణ మాటలకే పరిమితమవుతోంది. -
మామిడి.. మిగలని దమ్మిడి
[ 20-05-2024]
మామిడి రైతులను ఏటా ఏదో ఒక సమస్య వేధిస్తోంది. ఈ ఏడాది.. ఇప్పటికి ధరలు పర్వాలేదనుకున్నా.. శీతాకాలంలో గాలి వానలు, మంచు, తామర పురుగు ప్రభావంతో పూత రాలిపోయిన కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గాయి. -
ఎల్హెచ్ఎంఎస్ ఉంటే మీ ఇల్లు భద్రమే
[ 20-05-2024]
రెండు రోజుల క్రితం నెల్లూరు బాలాజీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలోతాళం వేసిన ఇంటినే లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని దుండగుడు దొంగతనానికి పాల్పడ్డాడు. తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారం దోచుకున్నాడు. -
బోధిస్తూ.. చైతన్యం
[ 20-05-2024]
ఆమె వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు. మొక్కల పెంపకంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. దీన్ని వ్యాపకంగా చేసుకున్నారు. మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ అని భావించారు. అందరితో మొక్కలు నాటించి పెద్దవయ్యేలా చేస్తున్నారు. -
మృత్యు దారులు
[ 20-05-2024]
కొద్దిరోజుల కిందట కావలి సమీపంలో ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో అయిదుగురు మృతి చెందగా.. పలువురు గాయాలపాలయ్యారు. -
ఓటేయకుండా.. ఓడారు!
[ 20-05-2024]
ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అద్వితీయ హక్కు... ఓటు. మనమే నిర్ణేతలమై.. అయిదేళ్లకు ఒకసారి మనల్ని పరిపాలించే వారిని ఎన్నుకునే వజ్రాయుధం ఓటు. అంతటి కీలకమైన ప్రజాస్వామ్య ఆయుధాన్ని కొందరు శ్రద్ధతో వినియోగించుకుంటే.. -
కోనలో బ్రహ్మోత్సవ వైభవం
[ 20-05-2024]
భక్తుల గోవింద నామస్మరణ.. మంగళ వాయిద్యాల నడుమ పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. -
జిల్లా వ్యాప్తంగా పోలీసుల సోదాలు
[ 20-05-2024]
పోలీసులు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల అణచివేత, దొంగతనాల నివారణ, అసాంఘిక శక్తుల ఏరివేతే కార్డన్ సర్చ్ ముఖ్య ఉద్దేశం. -
తప్పిపోయిన చిన్నారిని సంరక్షించిన మెరైన్ పోలీసులు
[ 20-05-2024]
మండల పరిధిలోని మైపాడు బీచ్లో తప్పిబోయిన చిన్నారిని మెరైన్ పోలీసులు వెతికిపట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన ఆదివారం జరిగింది. -
ఫ్రూట్ కవర్ మామిడి కిలో రూ.100
[ 20-05-2024]
జిల్లాలో ఫ్రూట్ కవర్ మామిడి పండ్లకు డిమాండ్ పలుకుతోంది. ఇవి కిలో రూ.100కు విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ