logo

తెదేపాలో పలువురి చేరికలు

కావలి రూరల్ మండలం గౌరవరంకు చెందిన ముగ్గురు వైకాపా వార్డు మెంబర్లతో సహా పలువురు ముఖ్య నేతలు తెదేపాలో చేరారు.

Updated : 10 May 2024 17:22 IST

కావలి: కావలి రూరల్ మండలం గౌరవరంకు చెందిన ముగ్గురు వైకాపా వార్డు మెంబర్లతో సహా పలువురు ముఖ్య నేతలు తెదేపాలో చేరారు. శుక్రవారం గౌరవరంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో వార్డు మెంబర్ కూసిపాటి సుభాష్ చంద్ర, కే.రాఘవేంద్ర, పోట్లూరి కోటయ్య లతో పాటు దేవరపల్లి పుల్లయ్య, కూసిపాటి యానాది, గంగుల సుమన్, శెట్టిపల్లి అన్నమయ్య, ఏ.ప్రశాంత్, కామేశ్వరరావు, టి. మాల్యాద్రి, శ్రీకాంత్ పార్టీలో చేరారు. వీరికి ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గౌరవరం నాయకులు సూరే శ్రీనివాసులు రెడ్డి, మేదరమిట్ల శ్రీనివాసులు రెడ్డి, మేదరమిట్ల ఈశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని