యంత్రాలపై అందని రాయితీ
ఆరుగాలం ఎండకు, వానకు ఓర్చి స్వేదం చిందించి పంటలు సాగు చేస్తున్నారు రైతులు. వారికి ప్రకృతి సహకరిస్తేనే పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.. ఎంతో కొంత మిగులుతుంది.
భారంగా మారిన వ్యవసాయం
న్యూస్టుడే, ఆర్మూర్ గ్రామీణం
యంత్రంతో ఎర్రజొన్న పంట కోస్తున్న రైతులు
ఆరుగాలం ఎండకు, వానకు ఓర్చి స్వేదం చిందించి పంటలు సాగు చేస్తున్నారు రైతులు. వారికి ప్రకృతి సహకరిస్తేనే పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.. ఎంతో కొంత మిగులుతుంది. సాగుకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో గతంలో ప్రభుత్వం అనేక పరికరాలు, యంత్రాలు రాయితీపై అందించేది. అది కాస్త మున్నాళ్ల ముచ్చటే అయ్యింది. కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం సబ్సిడీపై ఎలాంటి యంత్రాలు, పరికరాలు అందించడం లేదు. దీనికి తోడు రోజురోజుకు సాగు ఖర్చులు పెరిగిపోయి భారంగా మారాయి.
2018లో అటకెక్కింది..
రోటవేటర్పై 50 శాతం సబ్సిడీ, 33 శాతంపై పిచికారీ పరికరాలు రైతులకు అందజేసింది. కూరగాయ విత్తనాలతో పాటు ట్రాక్టర్లు, స్ప్రే పంపులు, కలుపుతీసే యంత్రాలు, వరి కోత మిషన్లు, టార్పాలిన్ కవర్లు సబ్సిడీపై అందించేవారు. భారాస ప్రభుత్వ తొలిసారి అధికారంలోకి వచ్చాక యంత్రలక్ష్మీ పథకంతో యంత్రాలపై 50 శాతం రాయితీ కల్పించింది. 2018 తర్వాత ఈ పథకం అటకెక్కింది. రైతులు యంత్రాలను కొనుగోలు చేసే పరిస్థితి లేక కూలీలపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది.
పరికరాలతో మేలు
వ్యవసాయ పనుల్లో యంత్రాలు వినియోగించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుకు అవకాశం ఉంటుంది. విత్తనాలు వేయడం, పంట కోత వరకు అన్ని పనులు యంత్రాలతో చేయడం ద్వారా సమయం, కూలీల కొరత తీరడంతో పాటు ఖర్చులు ఆదా అవుతాయి. వరి కోతల సమయంలో కూలీలు దొరకక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోత యంత్రాలు కొనుగోలు చేయడం రైతులకు భారం అవుతుంది. దీంతో అద్దెకు తీసుకువచ్చి పనులు పూర్తి చేసుకుంటున్నారు. వరి కోత యంత్రాలకు సబ్సిడీ అందిస్తే ఇబ్బందులు దూరం అవుతాయని రైతులు అంటున్నారు.
సాగు ఖర్చులు ఆదా
ప్రభుత్వం సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తే రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి సాగు ఖర్చులు ఆదా అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ యంత్రాల రాయితీ విషయంలో ఇంత వరకు ఎలాంటి నిర్ణయం చేయలేదు. రాయితీ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా మహేష్ గుప్తా
[ 16-06-2024]
కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా మహేష్ గుప్తా ఎన్నికయ్యారు. -
కనీస వేతనాలు అమలు చేయాలి
[ 16-06-2024]
పురపాలక కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ నాయకులు ఛైర్పర్సన్ ఇందు ప్రియకి వినతి పత్రం అందజేశారు. -
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!
-
‘నాన్న నేర్పిందే నా పిల్లలకూ చెప్పాను’.. వేదాంత చీఫ్ భావోద్వేగ పోస్ట్
-
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
-
విష్వక్ సేన్ కీలక నిర్ణయం.. ముఖ్య అతిథిగా హాజరై
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM