logo

Exam: శుక్రవారం పాలిసెట్ పరీక్ష

జిల్లాలో శుక్రవారం పాలిసెట్ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సమన్వయకర్త విజయ్‌ కుమార్ వెల్లడించారు.

Published : 23 May 2024 20:04 IST

కామారెడ్డి పట్టణం: జిల్లాలో శుక్రవారం పాలిసెట్ పరీక్ష నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా కేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా సమన్వయకర్త విజయ్‌ కుమార్ వెల్లడించారు. మొత్తం 2301 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరగనుంది. కేంద్రంలోకి 10 గంటల నుంచి అనుమతి ఇస్తారు. నిమిషం ఆలస్యమైనా లోనికి వెళ్లడానికి నిరాకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని