డబ్బుల విషయంలో గొడవ.. ఒకరి హత్య
మెండోరా మండలం పోచంపాడ్లో కల్లుబట్టీ వద్ద చేపలు పట్టిన డబ్బుల విషయంలో దుండి ప్రవీణ్ కుమార్(28), హసన్బిన్ అలీ అలియాస్ సాజిద్ మధ్య ఆదివారం వివాదం జరిగింది.
హత్యకు గురైన ప్రవీణ్కుమార్
బాల్కొండ, న్యూస్టుడే: మెండోరా మండలం పోచంపాడ్లో కల్లుబట్టీ వద్ద చేపలు పట్టిన డబ్బుల విషయంలో దుండి ప్రవీణ్ కుమార్(28), హసన్బిన్ అలీ అలియాస్ సాజిద్ మధ్య ఆదివారం వివాదం జరిగింది. ఈ గొడవలో సాజిద్ ప్రవీణ్కుమార్ను కొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు, మృతుడు ఇద్దరు స్నేహితులు. కాగా, చేపలు పట్టి విక్రయించగా వచ్చిన డబ్బుల విషయంలో సాజిద్ను ప్రవీణ్కుమార్ ప్రశ్నించగా, డబ్బులడిగి తన విలువ తీస్తున్నావనే కారణంతో కల్లుబట్టీ వద్ద గొడువ పడి హత్య చేశాడని ఆర్మూర్ గ్రామీణ సీఐ గోవర్ధన్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతుడు కూలీ పని చేస్తూ వచ్చిన డబ్బులతో స్నేహితులతో కలిసి మద్యం తాగి తిరిగే వాడని, ఒంటరిగా ఉండగా అదును చూసుకొని కొట్టి చంపాడని తెలిపారు. ప్రవీణ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
యువకుడి ఆత్మహత్య..
నిజామాబాద్ నేరవార్తలు: నగరంలోని నాందేవ్వాడ వంతెనపై నుంచి దూకి మోసిన్ అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకొన్నాడు. బాబాన్సాహెబ్ పహాడ్కు చెందిన ఇతడు ఆదివారం ఉదయం వారధిపై నుంచి దూకాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది.
మంటల్లో కాలి నలుగురు కుటుంబ సభ్యుల మృతి..
నాందేడ్: రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి గాయపడిన ఇంటి యజమాని, భార్య, కుమారుడు, కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందారు. ఈ విషాదకర ఘటన దెగ్లూర్ తహసీల్ కల్లూర్ గ్రామంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన సురేష్ బిరాదార్ (52), పొలాలకు మందులు చల్లుతూ కుటుంబాన్ని పోషిస్తారు. ఈ పని కోసం ఇంటికి పెట్రోలు తీసుకొచ్చారు. పంపులో పెట్రోలు పోస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సురేష్ (52), అతని భార్య గంగుబాయి, కుమారుడు కపిల్, కుమార్తె స్వాతి 80 శాతం కాలిపోయారు. వెంటనే వారిని నాందేడ్ శ్రీ గురుగోవింద్ సింగ్ మెమోరియల్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నలుగురి అంత్యక్రియలు గ్రామస్థులు నిర్వహించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ..
బోధన్: పట్టణంలోని వెంకటేశ్వరకాలనీలో తాళం వేసిన ఇంట్లో ఆదివారం చోరీ జరిగింది. సీఐ ప్రేమ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ..విజయ్ అనే ఫొటోగ్రాఫర్ నాలుగు రోజుల కిందట విజయవాడకు బంధువుల వద్దకు వెళ్లారు. ఇంటి తాళాలు పగులగొట్టిన దొంగలు పది తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేశామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.