logo

‘అలై బలై’ గోడ ప్రతుల ఆవిష్కరణ

రుద్రూర్‌ మండల కేంద్రంలోని బస్టాండు చౌరస్తాలో బీఎస్పీ నాయకులు ‘అలై బలై’ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ నెల 14న దుబాయిలో నిర్వహించే ‘అలై బలై’ కార్యక్రమానికి

Updated : 12 Aug 2022 17:10 IST

రుద్రూర్‌: రుద్రూర్‌ మండల కేంద్రంలోని బస్టాండు చౌరస్తాలో బీఎస్పీ నాయకులు ‘అలై బలై’ గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ నెల 14న దుబాయిలో నిర్వహించే ‘అలై బలై’ కార్యక్రమానికి బీఎస్పీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ హాజరవుతున్నారని తెలిపారు. దుబాయిలో ఉన్న తెలంగాణ కార్మికులు వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ బాన్సువాడ ఇన్‌ఛార్జి ఈశ్వర్‌, బాన్సువాడ అధ్యక్షుడు హరిప్రసాద్‌, శ్యామ్‌, నవీన్‌, రాజేందర్‌, చరణ్‌, మహేశ్‌, మోహన్‌, రాహుల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని