రుణం చెల్లించకుంటే ఆస్తుల జప్తు
భూమి తాకట్టు పెట్టి సహకార సంఘాలు, ఎన్డీసీసీబీ శాఖల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తున్నామని డీఆర్ఓఎస్డీ గంగాధర్ అన్నారు.
రూ. 18 లక్షల వసూలు
బ్రాంచి అధికారులతో మాట్లాడుతున్న డీఆర్వోఎస్డీ గంగాధర్, ఏజీఎం యాదగిరి
జుక్కల్, న్యూస్టుడే: భూమి తాకట్టు పెట్టి సహకార సంఘాలు, ఎన్డీసీసీబీ శాఖల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించకుంటే ఆస్తులు జప్తు చేస్తున్నామని డీఆర్ఓఎస్డీ గంగాధర్ అన్నారు. జనవరి 9న ‘ఈనాడు’లో ‘అధ్యక్షా.. ఆలకించరూ!’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. బుధవారం జుక్కల్ వచ్చి బ్రాంచి అధికారులతో, సొసైటీ ఛైర్మన్ నాగల్గిద్దె శివానంద్తో మాట్లాడారు. రుణగ్రహీతలకు నోటీసులు జారీ చేశారు. కథనం ప్రచురితమైన నుంచి రుణ వసూళ్లకు చర్యలు తీసుకోవడంతో 20 రోజుల్లోనే జుక్కల్ మండలంలోనే రూ.18 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. తాకట్టు భూమిలో హెచ్చరిక ఫ్లెక్సీ ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. తనఖా పెట్టిన భూమి అమ్మినా.. కొన్నా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. వెంట డీజీఎం యాదగిరి, బ్రాంచి మేనేజర్ సాయిలు, కార్యదర్శులు బాబురావు-జుక్కల్, హన్మాండ్లు- చిన్నకొడప్గల్, గంగాకిషోర్, నవీన్ ఉన్నారు.
ఆకలి తీర్చేందుకు ముందుకొస్తున్న దాతలు
దేవునిపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులతో డీఈఓ రాజు, కౌన్సిలర్లు
కాసర్ల గోదావరి, కృష్ణాజీరావు, ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్
కామారెడ్డి పట్టణం, న్యూస్టుడే: జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల వేళ వారి ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ‘ఈనాడు’లో జనవరి 29న ‘నీరసించి చదువు మరచి’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందిస్తున్నారు. దేవునిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ రూ.25 వేలు, కౌన్సిలర్లు కృష్ణాజీరావు, గోదావరి ఒక్కొక్కరు రూ.50 వేల చొప్పున మొత్తం రూ.లక్ష విరాళం ప్రకటించారు. రెండు నెలల పాటు పిల్లలకు స్నాక్స్ ఇస్తామన్నారు. డీఈఓ రాజు బుధవారం పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాతలు ముందుకు రావాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్, నాయకులు కాసర్ల స్వామి, నిట్టు లింగారావు, బాలకిషన్, శ్రీనివాస్, రమణ తదితరులున్నారు. కామారెడ్డి మండలం గర్గుల్లో ఎస్ఎంసీ ఛైర్మన్ నర్సింలు పిల్లలకు అల్పాహారం కోసం రూ.3 వేలు విరాళం ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.