కొత్తవి ఇవ్వరు.. పేర్లు చేర్చరు
ఆహార భద్రత కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా ఉంటోంది.
రేషన్ కార్డుల కోసం తప్పని ఎదురుచూపులు
న్యూస్టుడే, కామారెడ్డి కలెక్టరేట్
ఆహార భద్రత కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది లబ్ధిదారులు ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టింపులేనట్లుగా ఉంటోంది. దీంతో వేలాది మందికి ఆహారభద్రత పథకం అందడం లేదు. కామారెడ్డిలో 2.53 లక్షలు, నిజామాబాద్లో 4.02 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాల్లో కొత్తగా జన్మించిన వారి పేర్లు కార్డుల్లో చేర్చడానికి స్థానికంగా వీలులేకుండా పోయింది. దరఖాస్తుల వివరాలు రాష్ట్రస్థాయికి పంపించినప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కొత్త రేషన్కార్డులకు దరఖాస్తు చేయడానికి ఉద్దేశించిన సైట్ రెండేళ్ల నుంచి మూసి ఉంది.
పథకాలకు దూరం..
రేషన్కార్డులో పేరు నమోదు కాకపోవడంతో లబ్ధిదారులు వివిధ ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ఇటీవల స్థలం ఉన్న వారికి ప్రభుత్వం గృహలక్ష్మి పథకం తీసుకువచ్చింది. దరఖాస్తులతో పాటు రేషన్కార్డులు జత చేయాలని సూచించారు. రేషన్కార్డులు లేని వారు దరఖాస్తు చేసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. ఆరోగ్యశ్రీ కూడా వర్తించదని బాధితులు పేర్కొంటున్నారు. ఆహారభద్రత కార్డు ప్రకారమే ఆరోగ్యశ్రీ కార్డు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. కొత్త వారికి పేరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కార్డులో పేరు ఉంటే స్థానికంగా తహసీల్దార్తో ధ్రువీకరించుకుని అత్యవసర చికిత్సకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఇకనైనా రేషన్కార్డుల్లో పేర్లను నమోదు చేయించాలని కోరుతున్నారు.
జాప్యంతో ఇబ్బందులు
రేషన్ కార్డుల నుంచి వివాహమైన ఆడపిల్లల పేర్లు తొలగిస్తున్నారు. కాని అదే అమ్మాయి పేరును అత్తారింటి కార్డులో చేర్చడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చాలా మంది ఆడపిల్లలు తమ పేరును చేర్చాలంటూ దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇలాంటివి కామారెడ్డి జిల్లావ్యాప్తంగా 6,500 వరకు ఉన్నాయి. మరికొన్ని మండలాల్లో వివాహమైన ఆడపిల్లల పేర్లను తల్లిదండ్రుల కార్డులోంచి తొలగించడం లేదు. ఐదారేళ్ల కిందట జన్మించిన పిల్లల పేర్లు కార్డుల్లో లేకపోవడంతో వారికి బియ్యం రావడం లేదు. దీంతో కూలీ చేసి కుటుంబాన్ని పోషించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గతంలో వెనువెంటనే..
గతంలో కార్డుల జారీ, కొత్తవారి పేర్లు నమోదు చేసే ప్రక్రియ భిన్నంగా ఉండేది. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే చాలు కార్డుల జారీ, పేర్లు చేర్చడం వంటి ప్రక్రియలు వెనువెంటనే జరిగేవి. జిల్లాస్థాయిలో ఈ ప్రక్రియ నిర్వహించడానికి వెసులుబాటు ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కార్డులు జారీ చేయడం, సభ్యులను చేర్చడం, తొలగించడం అంతా రాష్ట్రస్థాయిలో ఉంది.
రాష్ట్రస్థాయిలోనే ప్రక్రియ
- మల్లికార్జున్బాబు, డీఎస్వో, కామారెడ్డి
రేషన్కార్డులో కొత్త సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియ అంతా రాష్ట్రస్థాయిలోనే జరుగుతుంది. దరఖాస్తులను సైట్లో అప్లోడ్ చేశాం. అయితే త్వరలో కొత్త సభ్యులను చేర్చనున్నట్లు సమాచారం. కొత్త రేషన్కార్డులకు సంబంధించిన సైట్ రెండేళ్లుగా మూసి ఉండడంతో దరఖాస్తులు ఏవీ పెండింగ్లో లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెరపైకి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
[ 17-05-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. -
కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
[ 17-05-2024]
జిల్లాలో వరి కోతలు మొదలై నెలరోజులైనా కొనుగోళ్లు పూర్తికావడం లేదు. హమాలీలు, సంచుల కొరత లేనప్పటికీ లారీలు లేక రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణకు రైసుమిల్లర్లు ససేమిరా అంటున్నారు. -
ఎత్తుకు పై ఎత్తులు
[ 17-05-2024]
ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాసకు చెందిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. -
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
[ 17-05-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
తక్కువ చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సులు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పెరిగిన వినియోగం.. తగ్గిన లబ్ధిదారులు
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్కార్డు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసి శూన్య బిల్లులు అందజేస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. -
వేసవి శిక్షణ.. లక్ష్యసాధన
[ 17-05-2024]
వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ చిన్నారులు తమలోని అంతర్గత ప్రతిభకు పదును పెడుతున్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ.. తమకు ఇష్టమైన రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్నారు. -
విభిన్న కోర్సుల ప్రత్యేకం
[ 17-05-2024]
ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. 158 ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది. -
మొబైల్ ‘దోస్త్’తో సులభం
[ 17-05-2024]
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇదివరకే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మొబైల్లో దోస్త్ ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. -
సెర్చ్ కమిటీ ఏర్పాటు
[ 17-05-2024]
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నూతన ఉపకులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్
[ 17-05-2024]
అనుమతి లేని లేఅవుట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయటాన్ని కట్టడి చేయటంపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా రూపొందిన దస్తావేజుల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
చరవాణి కోసం.. రైలు నుంచి దూకి
[ 17-05-2024]
ప్రాణం కంటే చరవాణి విలువైనది అనుకున్నాడేమో ఆ యువకుడు రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ కిందపడిపోవడంతో ఒక్కసారిగా దూకి తీవ్రగాయాలపాలయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ