ఉల్లి.. ఏడిపిస్తోంది..!
ఏటా ఉల్లి ధరలు ఆకాశాన్నంటి ప్రజలను కన్నీళ్లు పెట్టించడం చూస్తూనే ఉంటాం.
ఇతర రాష్ట్రాల నుంచి సరకు రాకతో రైతుల దిగులు
రాంపూర్లో కోసిన ఉల్లిని విక్రయించేందుకు సంచుల్లో నింపుతున్న రైతులు
న్యూస్టుడే, డిచ్పల్లి: ఏటా ఉల్లి ధరలు ఆకాశాన్నంటి ప్రజలను కన్నీళ్లు పెట్టించడం చూస్తూనే ఉంటాం. ఈసారి మాత్రం పంట సాగు చేసిన రైతులకు ఆశించిన ధర దక్కకపోవడంతో దిగులు చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర పర్వాలేదనిపిస్తున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి సరకు దిగుమతి అవుతుండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఈ యాసంగిలో సుమారు 230 ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం తగ్గడంతో ధర పెరుగుతుందని అన్నదాతలు భావించారు. గత నెలలో క్వింటాకు రూ.1,450-1,550 ధర పలుకగా ప్రస్తుతం రూ.1,250-1,300గా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ జిల్లాలోని హోల్సేల్ దుకాణాలకు సరఫరా చేయడమే ఇందుకు కారణం.
తప్పని పరిస్థితుల్లో విక్రయం
ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున రైతులు యాసంగిలో వరి సాగుకే మొగ్గు చూపారు. జిల్లాలోని డిచ్పల్లి, మోపాల్, ఇందల్వాయి, సిరికొండ, మోర్తాడ్, బాల్కొండ, వేల్పూర్, ఆర్మూర్ మండలాల్లో ఉల్లి సాగవుతోంది. ఈ సాగుకు పెట్టుబడి అధికంగా ఉంటుందని రైతులు ముందుకు రావడం లేదు. అంతేకాక చేతికొచ్చిన పంటను నిల్వ చేసేందుకు వసతులు లేక అమ్ముకోవాల్సి వస్తోంది. ధర తక్కువగా ఉండడం, మార్కెట్కు తరలించేందుకు ఖర్చులు అధికమవుతుండడంతో పొలాల్లోకే వచ్చిన దళారులకు విక్రయిస్తున్నారు. ప్రతి సీజన్లో నిజామాబాద్, మహబూబ్నగర్, వరంగల్, భువనగిరి, ఖమ్మం జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు.
నిల్వలపై నిఘా అవసరం
అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దళారులు ముందుచూపుతో ఉల్లి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ధర పెరిగినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, ధరలను కట్టడి చేయాలని కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను 2020 డిసెంబరులో ఆదేశించింది. హోల్సేల్ వ్యాపారులు 250 క్వింటాళ్లు, రిటెయిలర్స్ 20 క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోవచ్చని సూచించింది. కానీ వ్యాపారులు అధికంగా నిల్వ చేస్తున్నారు. వీటిపై నిఘా అవసరం.
క్వింటాకు రూ.1,500 చెల్లించాలి: రఘుపతి, రైతు, నర్సింగ్పూర్
రెండున్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. గత నెలతో పోలిస్తే ధర తగ్గింది. ఈ సాగుకు ఖర్చులు అధికంగా అవుతాయి. క్వింటాకు రూ.1,500 ధర చెల్లిస్తే మేలు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో విజృంభించిన చిల్లర దొంగలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలో విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, రాగి వైర్లను దొంగిలిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. -
మండలంలో విజృంభించిన చిల్లర దొంగలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలో విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, రాగి వైర్లను దొంగిలిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. -
ప్రమాద బీమా చెక్కు పంపిణీ
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలో గల యూనియన్ బ్యాంక్లో ఖాతాదారుడు మతమాల సిద్ధరాములు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును బ్యాంక్ అధికారులు శనివారం అందించారు. -
సంఘాల లోకోస్ డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి..
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. -
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. -
ఇక స్థానిక సమరమే..
[ 18-05-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచి ఎన్నికలపై దృష్టి సారించింది. -
నియంత్రికల ధ్వంసం.. రైతన్నలకు నష్టం
[ 18-05-2024]
నందిపేట్ మండలంలో వారం రోజుల వ్యవధిలోనే తల్వేద, సి.హెచ్.కొండూర్ ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల నుంచి దుండగులు నియంత్రికలను ఎత్తుకెళ్లారు. -
వివాదాల వైద్యశాఖ
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్యశాఖ ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. -
ఆలయాల్లో సౌరవిద్యుత్తు
[ 18-05-2024]
ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 18-05-2024]
గృహావసరాల విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. -
‘అమ్మ ఆదర్శ’ంగా నిలిచేలా..
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని టేక్రియాల్ ప్రభుత్వ ఉన్నత బడిలో విద్యార్థుల సౌకర్యార్థం మంచి నీటి వసతి కల్పనకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వరదనీటికి దారేది?
[ 18-05-2024]
ఈ ఏడాది రుతు పవనాల రాక ముందుగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం