ఔషధ దుకాణాలపై నజర్
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు.
ఔషధ దుకాణాలపై నజర్
ముమ్మరంగా కొనసాగుతున్న దాడులు
న్యూస్టుడే, నిజామాబాద్ వైద్యవిభాగం
- జిల్లా కేంద్రం వినాయక్నగర్లోని బయోమెడిక్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో రూ.6 లక్షల విలువ చేసే నకిలీమందులను ఔషధ నియత్రణ శాఖ ఏడీ నర్సయ్య, శ్రీకాంత్, శ్రీలత స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఔషధాలను కోర్టుకు అప్పగించారు.
- నెల కిందట నగరంలోని బొబ్బిలి వీధి వీక్లీమార్కెట్లోని శ్రీనారాయణ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్ డీపీసీ(డ్రగ్ కంట్రోల్ ప్రైజ్) నిర్వాహకులు ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఔషధ నియంత్రణ అధికారులకు పట్టుబడ్డారు. నిబంధనల ప్రకారం ప్లూనారిజిన్ 10 మాత్రలు రూ.40.82 అమ్మాల్సి ఉండగా రూ.99కి విక్రయించారు.
- కొద్ది రోజుల కిందట వాతారిన్ ఆయుర్వేద మాత్రలపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి దేవిరోడ్లోని దుకాణాన్ని తనిఖీ చేశారు. మాత్రలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. ఫలితంగా స్థానిక పరిచయాలు, నాయకుల పైరవీలు, ఒత్తిడి వంటి అంశాల నుంచి వారికి స్వేచ్ఛ లభిస్తోంది. గత నెలలో ఆదిలాబాద్ అధికారులు నగరశివారు ఖానాపూర్(భాగ్యనగర్)లోని నాలుగు మందుల దుకాణాలు, ముబారక్నగర్లో ఒకటి, దుబ్బాలో రెండింటిని సీజ్ చేశారు.
ఫార్మాసిస్టులు తప్పనిసరి
గతంలో పలు దుకాణాల్లో ఫార్మసిస్టులు ఉండేవారు కాదు. కానీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యహరించేవారు. ప్రస్తుతం తనిఖీల్లో ప్రధానంగా ఫార్మసిస్టు ఉండటం, మత్తు ఔషధాల విక్రయం, బిల్లు బుక్కుల నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత చేసినా చాలా దుకాణాల్లో ఫార్మసిస్టులను నియమించుకోవడం లేదు.
సిబ్బంది కొరత
పట్టణాల్లో గల్లీకొకటి, చిన్న గ్రామాల్లోనూ మూడు, నాలుగు ఫార్మసీలు వెలుస్తున్నాయి. అలాగే నాలుగైదుగురు ఆర్ఎంపీలు ఉంటున్నారు. ఎవరికితోచినట్లు వారు యాంటీ బయోటిక్స్, మత్తు కలిగించే, నొప్పుల మాత్రలు విక్రయిస్తున్నారు. సంబంధిత శాఖలో కేవలం ముగ్గురే అధికారులు ఉండటంతో పర్యవేక్షణ కష్టంగా మారింది.
నిబంధనలు తప్పక పాటించాలి
- శ్రీకాంత్, ఔషధ నియంత్రణ శాఖ అధికారి
ఔషధ దుకాణాదారులు నిబంధనలు పాటించాలి. తప్పనిసరిగా ఫార్మసిస్టును నియమించుకోవాలి. వైద్యుడి చీటి లేకుండా మందులు విక్రయించొద్దు. కొనుగోలుదారులు బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం