logo

చోరీలకు పాల్పడిన నిందితుడి రిమాండ్‌

మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

Published : 29 Mar 2024 05:08 IST

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సత్యనారాయణ

బాన్సువాడ పట్టణం, న్యూస్‌టుడే: మద్యానికి బానిసై చోరీలు చేసిన నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు డీఎస్పీ సత్యనారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 26న మద్నూర్‌లో మహాజన్‌ బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో 25తులాల బంగారం, రూ.16వేల నగదును అదే గ్రామానికి చెందిన ఉప్పరివార్‌ శ్రీను అపహరించాడు. దీని విలువ మొత్తం రూ.13.31లక్షలు ఉంటుంది. 27న సాయంత్రం పెట్రోలింగ్‌ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా చేతిలో సంచి పట్టుకొని తిరుగుతున్న అతడిని పట్టుకొని విచారించగా మద్యానికి బానిసై చోరీలు చేస్తున్నట్లు అంగీకరించాడు. అతని నుంచి సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. మూడు నెలల కిందట బాగన్న మఠానికి సంబంధించిన షటర్స్‌లో సైతం దొంగతనం చేశాడని వివరించారు. సమావేశంలో బిచ్కుంద సీఐ నరేష్‌, ఎస్సై శ్రీకాంత్‌, సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని