logo

కామారెడ్డి బల్దియా ఛైర్‌పర్సన్‌ తనిఖీలు

కామారెడ్డి పురపాలక సంఘం సానిటరీ కార్యాలయంలో  కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు.

Updated : 16 Apr 2024 16:55 IST

కామారెడ్డి పట్టణం: కామారెడ్డి పురపాలక సంఘం సానిటరీ కార్యాలయంలో  కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించి మున్సిపల్ కార్మికులకు పలు సూచనలు చేశారు. కార్మికులు ప్రతిరోజు పారిశుద్ధ్య  పనుల్లో హాజరై వార్డును శుభ్రంగా ఉంచాలని సూచించారు.  కార్మికులకు ఆరోగ్య సమస్యలు ఇతర అత్యవసర పనులు ఉన్నప్పుడు ముందస్తు సమాచారంతో సెలవు పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని