ప్రజలు మళ్లీ మోసపోవద్దు
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
భాజపా, కాంగ్రెస్లను ఓడించాలి
బహిరంగ సభలో భారాస నేతలు
భారాస అభ్యర్థి బాజిరెడ్డికి మద్దతు తెలుపుతున్న రాజ్యసభ సభ్యుడు సురేష్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్రెడ్డి (బాల్కొండ), డాక్టర్ సంజయ్ (కోరుట్ల), డాక్టర్ సంజయ్(జగిత్యాల), కమలాకర్ (కరీంనగర్), నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ విఠల్రావు, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, జగిత్యాల, నిజామాబాద్ భారాస జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు, జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మేయర్ నీతూకిరణ్ తదితరులు
ఈనాడు, నిజామాబాద్: భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాలంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో బాజిరెడ్డి ప్రసంగించారు. రాముడి పేరు చెప్పుకొని పాలన సాగించే మోదీ పేదలను విస్మరించారని విమర్శించారు. ఒకే కుటుంబం నుంచి తండ్రి-కొడుకులు ఎంపీలుగా ఉండటం అరుదుగా ఉంటుందని, ఆ అవకాశం దక్కిన అర్వింద్, ఐదేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి.. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇక్కడి ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోలేదన్నారు. అసలు కాంగ్రెస్ రాజశేఖర్రెడ్డితోనే పోయిందని.. ఇప్పుడు పాత కాంగ్రెసోళ్లు రేవంత్కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
గులాబీ శ్రేణుల్లో జోష్..
అధికారం కోల్పోయాక భారాస జిల్లాలో తొలి బహిరంగ సభను శుక్రవారం నగరంలో నిర్వహించింది. సభ చెప్పిన సమయం కంటే ఆలస్యమైనప్పటికీ.. పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావటంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు ఉద్యమ కాలంలో మాదిరిగా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. గ్రామగ్రామాన ప్రచారం ఉద్ధృతం చేసి నిజామాబాద్ స్థానాన్ని గెలిపించుకుందామని నాయకులు కోరారు.ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి మహమూద్ అలీ, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల భారాస అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఆశన్నగారి జీవన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తా, మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా సభలో ప్రసంగించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తప్పుడు కేసులతో భారాస నేతలను ఇబ్బంది పెడుతున్నారని జీవన్రెడ్డి ఆరోపించారు. చిన్న కేసులో తన కొడుకును చిత్రహింసలకు గురిచేసి.. రాజకీయ కక్ష సాధింపులకు దిగారని అయేషా ఫాతిమా పేర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, రెండు జిల్లాల జడ్పీ ఛైర్మన్లు విఠల్రావు, వసంత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, జడ్పీటీసీ సభ్యులు జగన్, సుమన, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అర్వింద్-సుదర్శన్రెడ్డి కుమ్మక్కు
- ప్రశాంత్రెడ్డి, మాజీ మంత్రి
అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్రెడ్డి గెలిచేందుకు అర్వింద్ సహకరించారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం అర్వింద్తో సుదర్శన్రెడ్డి కుమ్మక్కయ్యారు. బడాభాయ్..చోటా భాయ్ బంధంలో భాగంగా రేవంత్రెడ్డి మోదీతో ఒప్పందంలో భాగంగా బలహీనమైన అభ్యర్థులను నిలిపారు. పసుపు సాగు విస్తీర్ణం తగ్గి డిమాండ్ ఏర్పడి ఈ సారి ధర పెరిగింది. ఇందులో అర్వింద్ కృషి ఏమీ లేదు.
ఇద్దరం పోరాడుతాం..
- సురేష్రెడ్డి, ఎంపీ రాజ్యసభ
డిసెంబరు 9న చేస్తానన్న రుణమాఫీ గురించి అడిగితే.. ఆగస్టు 15 అంటున్నారు. ప్రజలకు మేలు చేసే పనులు ఎగవేస్తున్నారు. భారాసను గెలిపిస్తే రాజ్యసభలో నేను, లోక్సభలో బాజిరెడ్డి జూన్లో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో పసుపు బోర్డు అంశం మీదే మాట్లాడతాం.
వంద రోజుల్లో ఆగం చేశారు..
- శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి
కేసీఆర్ పదేళ్లు కష్టపడి అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపితే.. కాంగ్రెసోళ్లు వంద రోజుల్లో ఆగం చేశారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం మోసపూరిత మాటలతో మభ్యపెడుతోంది.
ప్రైవేటులో ధాన్యం అమ్మకం
- గంగుల కమలాకర్, మాజీ మంత్రి
నేను మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోళ్లకు మూడు నెలల ముందే కసరత్తు చేసి ఇబ్బందులు లేకుండా చూశాం. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఖాతాలో వేస్తుందో లేదో తెలియక రైతులు ప్రైవేటులో అమ్ముకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అభ్యర్థిని గెలిపించాలి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భారాస పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ కోరారు. -
నీటి నమూనాల సేకరణ
[ 02-05-2024]
మండలంలోని కామారెడ్డి మద్దికుంట, ఇతన్నపల్లి గ్రామాలలో నీటి నమూనాలను జిల్లా భూగర్భజల శాఖ అధికారి సతీశ్ యాదవ్ సేకరించారు. -
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 5న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న టేక్ దుంగలు పట్టివేత
[ 02-05-2024]
అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం
[ 02-05-2024]
కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. -
ఎయిర్టెల్ టవర్కు నిప్పు
[ 02-05-2024]
మండల కేంద్రంలో గల ప్రముఖ సెల్ కంపెనీ ఎయిర్టెల్కు చెందిన టవర్కు గురువారం నిప్పుఅంటుకుంది. -
కాంగ్రెస్ శ్రేణుల ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపే లక్ష్యం
[ 02-05-2024]
దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ప్రధాని మోదీతోనే సాధ్యం అని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ అన్నారు. -
నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు
[ 02-05-2024]
మండల కేంద్రంలో నల్ల పోచమ్మ గుడికి వెళ్లి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. -
దేశాభివృద్ధి చెందాలంటే భాజపాకి పట్టం కట్టాలి
[ 02-05-2024]
మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మిగిలింది పది రోజులే..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 02-05-2024]
నిత్యం ప్రజల్లో ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 2,19,784 మంది
[ 02-05-2024]
గడిచిన ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఓటు నమోదుకు అధికారులు చేస్తున్న ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు సార్లు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. -
మెజార్టీ పోటీ
[ 02-05-2024]
లోక్సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉన్నందున ఇంటింటి ప్రచారం సాధ్యంకాని పరిస్థితి. దీంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులపైనే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తెచ్చే బాధ్యతను మోపాయి. -
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఆచార్య కోదండరాం
[ 02-05-2024]
స్వలాభం కోసం కొందరు మతం పేరిట ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం- బహిరంగ చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘కాంగ్రెస్ వాగ్దానాలతో మోసపోయిన అన్నివర్గాలు’
[ 02-05-2024]
మోసపూరిత కాంగ్రెస్, భాజపాలను పార్లమెంటు ఎన్నికల్లో పాతర పెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
రక్తం కొరత.. రోగులకు వెత
[ 02-05-2024]
‘జిల్లాకేంద్రానికి చెందిన గర్భిణి భవానికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించింది. అందులో ఆ రక్త విభాగానికి సంబంధించి ఒకే యూనిట్ నిల్వ ఉంది. -
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ చేపట్టన అభివృద్ధి పనులు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం జనంలోకి వచ్చే అటవీ జంతువులు.. ప్రస్తుతం అటవీ అధికారులు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలతో వనంలోనే దాహం తీర్చుకుంటున్నాయి. -
సాహస దీపిక
[ 02-05-2024]
విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని.. సాహస క్రీడల్లో పాల్గొంటే జాతీయస్థాయిలో సత్తాచాటవచ్చని నిరూపించారు గిరిరాజ్ కళాశాలకు చెందిన దీపిక. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
[ 02-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. అప్రమత్తతతోనే ఆపదలను నివారించవచ్చు అంటున్నారు అధికారులు. మే 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతిభ
[ 02-05-2024]
హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు’లు అనే అంశంలో నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్). -
73 ఏళ్లుగా పోలింగ్ కేంద్రం
[ 02-05-2024]
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆంగ్లేయులను పారదోలిన మహాత్మా గాంధీ పేరుతో జిల్లా కేంద్రంలో వెలసిన బాపూజీ వచనాలయం పాఠకులకు విజ్ఞాన నేస్తంగా నిలుస్తోంది. ఈ పఠనాలయాన్ని 1951లో ఏర్పాటు చేశారు. -
అభ్యర్థుల తరఫున అన్నీ తామై..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల, జిల్లాస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. -
లోక్సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది
[ 02-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలు భాజపా, భారాస, కాంగ్రెస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్