జహీరాబాద్ బరిలో 19 మంది
నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
న్యూస్టుడే, సంగారెడ్డి టౌన్, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు : నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారం ముగియగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 19 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించగా.. 40 మంది 68 సెట్లు దాఖలు చేశారు. పరిశీలన ప్రక్రియలో 14 మందికి చెందిన 19 సెట్లు తిరస్కరించారు. 26 మంది అభ్యర్థుల నామపత్రాలను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. బరిలో ఉన్న వారిలో జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా.. రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలకు చెందిన వారు ఆరుగురు, మిగతా పది మంది స్వతంత్రులు. అభ్యర్థుల సంఖ్య 15 దాటడంతో ఒక్కో పోలింగ్ కేంద్రంలో రెండు చొప్పున ఈవీఎంలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రధాన పార్టీల అభ్యర్థుల నేపథ్యం
గాలి అనిల్కుమార్ - భారాస : తెరాస ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగారు. 2009లో పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్లో చేరి.. గత పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ ఎమ్మెల్యేగా పోటీ కోసం కాంగ్రెస్ తరఫున కార్యక్రమాలు నిర్వహించారు. టికెట్ రాకపోవడంతో తిరిగి భారాస గూటికి చేరారు. ప్రస్తుతం ఎంపీగా గెలుపునకు ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
బీబీ పాటిల్ - భాజపా : స్వగ్రామం కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలం సిర్పూర్. జహీరాబాద్ నుంచి రెండు పర్యాయాలు (2014, 2019లో) భారాస అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ఇటీవల భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా నుంచి పోటీ¨లో ఉన్నారు. మూడోసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
సురేష్ కుమార్ షెట్కార్ - కాంగ్రెస్ : 1992 నుంచి 1997 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2004 వరకు రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణఖేడ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొదటి ఎంపీగా విజయం సాధించారు. 2014లో జహీరాబాద్, 2018లో నారాయణఖేడ్ నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోసారి పార్లమెంట్లో అడుగుపెట్టాలని చూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓపెన్ జిమ్ పార్కును పరిశీలించిన బల్దియా ఛైర్ పర్సన్
[ 20-05-2024]
పట్టణంలోని గోదాం రోడ్ మున్సిపల్ ఓపెన్ జిమ్ పార్క్ ను బల్దియా ఛైర్ పర్సన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. -
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ