logo

భారీ మెజారిటీతో గెలిపించాలి

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పల్లె పొగడ తాండ, బొల్లారం గ్రామాలలో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు.

Updated : 04 May 2024 15:54 IST

నాగిరెడ్డిపేట: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పల్లె పొగడ తాండ, బొల్లారం గ్రామాలలో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తుందని ఉపాధి హామీ కూలీలకు చెప్పారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు. ప్రచారంలో మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, క్రమశిక్షణ సంఘం సభ్యులు రామచంద్రారెడ్డి, విట్టల్ రెడ్డి, గంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి దివిటీ కిష్టయ్య, భీం రెడ్డి, సుధాకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని