logo

ఈవీఎంల పనితీరుపై ఆరా

ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి ఆదేశించారు.

Updated : 04 May 2024 19:40 IST

కామారెడ్డి పట్టణం: ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారి ఆదేశించారు. శనివారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు గోపాల్ జి తివారితోపాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకుడు గోపాల్ జి తివారి మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని