logo

‘370 సీట్లతో భాజపా మూడోసారి అధికారంలోకి’

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Updated : 05 May 2024 06:46 IST

ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

భిక్కనూరు, బీబీపేట, న్యూస్‌టుడే: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 370 సీట్లతో మూడోసారి కేంద్రంలో భాజపా అధికారం చేపట్టనుందని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం భిక్కనూరు, బీబీపేటలో మండలస్థాయి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలే మరోసారి భాజపాను గెలిపిస్తాయని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని కోరారు. భాజపా ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ను భారీ మెజారిటీతో గెలిపించి మోదీకి బహుమతి ఇవ్వాలని అన్నారు. తాను గతంలో ఇచ్చిన హామీలు, అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేస్తానన్నారు. అంతకుముందు భిక్కనూరులో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. భాజపా అసెంబ్లీ కన్వీనర్‌ కుంట లక్ష్మారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు ఉప్పరి రమేష్‌, బట్టుపల్లి రంజిత్‌గౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని