‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’
కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు.
మాట్లాడుతున్న మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
కామారెడ్డి అర్బన్, న్యూస్టుడే: కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, భారాస జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్లతో కలిసి శనివారం ఆయన మాట్లాడారు. కొత్తజిల్లాలను రద్దుచేసి ప్రతి లోక్సభ స్థానాన్ని ఒక్కో జిల్లాకేంద్రంగా మార్చాలనే కాంగ్రెస్ ప్రభుత్వ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తప్పుడు ఆలోచనను విరమించుకోవాలని.. లేదంటే ఉద్యమించక తప్పదని వారు పేర్కొన్నారు. ఈ విషయమై మే 13లోగా కచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాను రద్దు చేసి 170 కిలోమీటర్ల దూరంలో ఉండే జహీరాబాద్ను జిల్లాను చేస్తే ప్రజలు అక్కడికి వెళ్లి పనులు చేసుకోవాలంటే ఏవిధమైన కష్టాలను అనుభవిస్తారో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలియడం లేదని వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కృత్రిమ కరవు తీసుకొచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కొత్త గేమ్ ఆడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రద్దు చేస్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని భాజపా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఘాల లోకోస్ డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి..
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. -
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. -
ఇక స్థానిక సమరమే..
[ 18-05-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచి ఎన్నికలపై దృష్టి సారించింది. -
నియంత్రికల ధ్వంసం.. రైతన్నలకు నష్టం
[ 18-05-2024]
నందిపేట్ మండలంలో వారం రోజుల వ్యవధిలోనే తల్వేద, సి.హెచ్.కొండూర్ ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల నుంచి దుండగులు నియంత్రికలను ఎత్తుకెళ్లారు. -
వివాదాల వైద్యశాఖ
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్యశాఖ ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. -
ఆలయాల్లో సౌరవిద్యుత్తు
[ 18-05-2024]
ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 18-05-2024]
గృహావసరాల విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. -
‘అమ్మ ఆదర్శ’ంగా నిలిచేలా..
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని టేక్రియాల్ ప్రభుత్వ ఉన్నత బడిలో విద్యార్థుల సౌకర్యార్థం మంచి నీటి వసతి కల్పనకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వరదనీటికి దారేది?
[ 18-05-2024]
ఈ ఏడాది రుతు పవనాల రాక ముందుగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!