దోస్త్కు వేళాయె..!
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల
తెవివి పరిధిలో 33,630 సీట్లు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 74 డిగ్రీ కళాశాలల్లో 33,630 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వర్సిటీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం తమ హాల్ టికెట్ నంబరుతో దోస్త్ వెబ్సైట్ https://gg.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
మూడు విడతల్లో కేటాయింపులు
డిగ్రీ కళాశాలల్లో మూడు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యార్థులు రూ.200 రుసుము చెల్లించి రాష్ట్రంలో నచ్చిన కళాశాలలో సీటు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 3వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్ 4 నుంచి 10 మధ్యలో సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
రూ.400 రుసుముతో రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4-13 వరకు చేసుకోవాలి. జూన్ 4-14 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. జూన్ 18న సీట్ల కేటాయింపు. జూన్ 19-24 మధ్యలో రిపోర్టు చేయాలి.
మూడో దశలో జూన్ 19-25 వరకు రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్ 19-25 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 29న సీట్ల కేటాయింపు, జూన్ 29 నుంచి జులై 3వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
జూన్ 29 - జులై 5వ తేదీ మధ్యలో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులంతా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలి. జులై 1 నుంచి కళాశాలల్లో పునశ్చరణ జరుగుతుంది. జులై 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
కొత్త కోర్సులు
డిగ్రీ కోర్సులకు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు ముమ్మరంగా కల్పించేందుకు మరికొన్ని కొత్త కోర్సుల ప్రారంభానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీ.కామ్ ఫైనాన్స్తో పాటు బీఎస్సీ బయో మెడికల్ సైన్స్, బీఏ స్పెషల్, బీఏ పబ్లిక్ పాలసీ లాంటి నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండలంలో విజృంభించిన చిల్లర దొంగలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలో విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, రాగి వైర్లను దొంగిలిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. -
మండలంలో విజృంభించిన చిల్లర దొంగలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలో విద్యుత్ నియంత్రికల నుంచి ఆయిల్, రాగి వైర్లను దొంగిలిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు శనివారం తెలిపారు. -
ప్రమాద బీమా చెక్కు పంపిణీ
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండలంలో గల యూనియన్ బ్యాంక్లో ఖాతాదారుడు మతమాల సిద్ధరాములు గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును బ్యాంక్ అధికారులు శనివారం అందించారు. -
సంఘాల లోకోస్ డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి..
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. -
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. -
ఇక స్థానిక సమరమే..
[ 18-05-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచి ఎన్నికలపై దృష్టి సారించింది. -
నియంత్రికల ధ్వంసం.. రైతన్నలకు నష్టం
[ 18-05-2024]
నందిపేట్ మండలంలో వారం రోజుల వ్యవధిలోనే తల్వేద, సి.హెచ్.కొండూర్ ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల నుంచి దుండగులు నియంత్రికలను ఎత్తుకెళ్లారు. -
వివాదాల వైద్యశాఖ
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్యశాఖ ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. -
ఆలయాల్లో సౌరవిద్యుత్తు
[ 18-05-2024]
ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 18-05-2024]
గృహావసరాల విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. -
‘అమ్మ ఆదర్శ’ంగా నిలిచేలా..
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని టేక్రియాల్ ప్రభుత్వ ఉన్నత బడిలో విద్యార్థుల సౌకర్యార్థం మంచి నీటి వసతి కల్పనకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వరదనీటికి దారేది?
[ 18-05-2024]
ఈ ఏడాది రుతు పవనాల రాక ముందుగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు..!’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన