logo

అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యం

రూరల్‌ ఠాణా పరిధి మల్లారం అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ ఠాణాలో కొన్ని రోజుల కింద గంగయ్య(40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు అయ్యింది.

Published : 06 May 2024 04:27 IST

నిజామాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: రూరల్‌ ఠాణా పరిధి మల్లారం అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ ఠాణాలో కొన్ని రోజుల కింద గంగయ్య(40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కేసు నమోదు అయ్యింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆయన చరవాణి సిగ్నల్‌ ఆధారంగా నగరానికి వచ్చారు. ఈ క్రమంలో ఆదివారం మల్లారం శివారు అటవీ ప్రాంతంలో కాలిన మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలానికి రూరల్‌ సౌత్‌ సీఐ బృందం, నేరడిగొండ పోలీసులు చేరుకొని మృతదేహం గంగయ్యదే అని నిర్ధారించారు. మృతుడు నగరానికి ఎందుకు వచ్చారు? ఎవర్ని కలిశారు? ఎవరైనా హత్య చేశారా? తదితర కోణాల్లో అక్కడి పోలీసులు స్థానికంగా విచారణ ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని