logo

‘70 ఏళ్లుగా ఓటేస్తున్నా’

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు.

Published : 07 May 2024 06:03 IST

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. అందరూ వజ్రాయుధాన్ని ఉపయోగించుకోవాలి. బాధ్యతను మరవవద్దు. నేను 70 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నా. మీరు పోలింగ్‌కేంద్రాలకు తరలివెళ్లండి అని చెబుతున్నారు నిజామాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మేక రామస్వామి. గాంధీ విచార్‌మంచ్‌ సంస్థను ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య విలువల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు తన వయసు 92 ఏళ్లని.. ఆరోగ్యం సహకరించకున్నా.. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి హక్కును సద్వినియోగం చేసుకుంటున్నానని గర్వంగా చెబుతున్నారు. పోలింగ్‌ రోజు సెలవు దినం.. కాదని భవిష్యత్తును నిర్ణయించే విలువైన సమయమని ఆయన పేర్కొన్నారు.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ సాంస్కృతికం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని