నేతల నోట.. తీయటి మాట
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత.
అందరి ప్రసంగాల్లో నిజాం సుగర్స్ పునరుద్ధరణ
న్యూస్టుడే, బోధన్ పట్టణం
నిజాం సుగర్స్.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వం. ఇప్పుడు రాజకీయ నినాదం. ఇవీ పరిశ్రమ గురించి క్లుప్త విషయాలు.. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి లోక్సభ ఎన్నికల్లో నిజాం సుగర్స్ ప్రధాన పార్టీలకు ముఖ్య అజెండాగా మారింది. ప్రచారంలో పరిశ్రమ పేరు లేకుండా ముఖ్య నాయకులు, అభ్యర్థుల ప్రసంగాలు ముగియడం లేదంటే ఎంత ప్రాముఖ్యం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ నేపథ్యం..
నిజాం కాలంలో ఏర్పాటైన చక్కెర కర్మాగారాల్లో బోధన్ చక్కెర పరిశ్రమ, ఆల్కహాల్, మెదక్, మెట్పల్లి యూనిట్లు మిగిలాయి. వాటిని 51 శాతం ప్రైవేట్, 49 శాతం ప్రభుత్వ వాటాతో నిజాం దక్కన్ సుగర్స్గా భాగస్వామ్య యాజమాన్యంగా మార్చారు. అలా 2002 నవంబర్ 1 నుంచి నిర్వహిస్తున్న భాగస్వామ్య యాజమాన్యంపై 2004లో ఏర్పాటైన సభాసంఘం కమిటీ ప్రభుత్వ స్వాధీనానికి సిఫార్సు చేసింది. అది అమలుకు నోచుకోకపోవడంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం తదనంతర పరిణామాలతో 2015 డిసెంబర్లో యాజమాన్యం లేఆఫ్ ప్రకటించింది. పరిశ్రమ నిర్వహణ బాధ్యతలు రైతులు తీసుకుంటే ఆర్థికంగా ప్రభుత్వం నుంచి చేయూత అందిస్తామని నాటి సర్కారు ప్రకటించగా.. కర్షకులు విముఖత చూపారు. అప్పటి నుంచి కర్మాగారంపై అనిశ్చితి ఏర్పడింది.
ఎన్నికలతో తెరమీదకు..
ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమకు చెందిన మూడు యూనిట్లలో రెండు (బోధన్, మెట్పల్లి) యూనిట్లు లోక్సభ పరిధిలో భారీ పరిశ్రమలు కావడంతో వాటి పునరుద్ధరణను ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. పరిశ్రమను పునరుద్ధరిస్తామని 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ప్రాథమికంగా రుణ బకాయిల చెల్లింపును పరిష్కరించాలని గుర్తించి ఇటీవల ఒక విడతగా రూ.43 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వం పునరుద్ధరణపై కట్టుబడి ఉందని కాంగ్రెస్ ఉద్ఘాటిస్తుండగా.. కేంద్ర సహకారంతో పునరుద్ధరించడానికి సిద్ధమని భాజపా ప్రకటించింది. ఇతర పార్టీలు ఇచ్చిన హామీలపై భారాస నిలదీస్తోంది.
మూడు యూనిట్ల గురించి క్లుప్తంగా..
- బోధన్లో 163 ఎకరాల్లో విస్తరించిన పరిశ్రమ సామర్థ్యం (గానుగాడించే) రోజుకు 3500 మె.ట. తర్వాత దీనిని 5 వేల మె.టకు విస్తరించారు. దాదాపు ఎనిమిది మండలాల పరిధిలో 15వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. రోజుకు 30వేల లీటర్లకు పైగా ఆల్కహాల్ ఉత్పత్తి డిస్టిలరీ ఉంది. 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. వేలాది మంది చెరకు సాగు రైతులు పరిశ్రమకు అనుబంధంగా ఉంటారు. 300 మంది వరకు కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తారు. ఇక్కడ క్వార్టర్లను కార్మికులకే విక్రయించారు.
- మెట్పల్లిలో 204 ఎకరాల్లో విస్తరించిన కర్మాగార సామర్థ్యం రోజుకు 2500 మె.ట. ఇక్కడ 120 ఫ్యాక్టరీ క్వార్టర్లు ఉన్నాయి. పర్మనెంట్ 200, సీజనల్ కార్మికులు 300 మంది. దాదాపు 4-5వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఇప్పటికీ అక్కడ చెరకు సాగు చేస్తున్న రైతులు వంద కి.మీ పరిధిలోని కామారెడ్డి పరిశ్రమకు తరలిస్తున్నారు. గత ఏడాది 1.20లక్షల మె.ట, ఈ సారి 98 వేల మె.ట చెరకు దిగుబడి అయిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఏడాదికి 60వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు సమాచారం.
- మెదక్లో 153 ఎకరాల్లో ఉన్న కర్మాగారం సామర్థ్యం రోజుకు 1800 మె.ట. 10-15 మండలాల పరిధిలో 4500 హెక్టార్లలో చెరకు సాగయ్యేది. ఇక్కడ 280 మంది కార్మికులుండేవారు. వారి కోసం నిర్మించిన 130 క్వార్టర్లు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల
[ 19-05-2024]
జూన్ 7 నుంచి 11 వరకు శ్రీ లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్షం నెరవేరడం లేదు. -
ఈఏపీసెట్లో మెరిసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు
[ 19-05-2024]
రాష్ట్రంలో శనివారం వెల్లడించిన ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్టపడి చదివి ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మొక్కల పెంపకానికి విత్తనాల సేకరణ
[ 19-05-2024]
అడవుల్లో పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
[ 19-05-2024]
వేసవి సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో నిర్వహించే అన్ని శిబిరాల్లో క్రీడాకారులు కిక్కిరిసిపోతున్నారు. -
ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలేవి
[ 19-05-2024]
పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి వాడి పడేసే(సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 19-05-2024]
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం పిట్లం మండలం గౌరారం తండాలో చోటుచేసుకుంది. -
‘రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
[ 19-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతినని చెప్పుకొంటూ వారిని మోసం చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. -
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
[ 19-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. -
గ్రూప్-1 నిర్వహణకు 12 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 12 కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం.. సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. గడిచిన వానాకాలం చీడపీడలు, తెగుళ్లతో పంట దిగుబడులు రాక కర్షకులకు నష్టాలే మిగిలాయి. -
లక్ష్యం శతశాతం
[ 19-05-2024]
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM