అగ్రనేతలు వస్తున్నారు
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.
నేడు భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో
జిల్లాకేంద్రానికి 10న ప్రియాంక, సీఎం రేవంత్రెడ్డిల రాక
ఈనాడు, కామారెడ్డి
పోలింగ్ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంగళవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో భారాస అధినేత కేసీఆర్ రోడ్షోలో పాల్గొని తర్వాత కూడలి సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగసభకు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు.
బస్సుయాత్రపై ఆసక్తి
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఉద్యమగడ్డలో పట్టు నిలుపుకొనేందుకు భారాస మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్కుమార్ను బరిలో నిలిపింది. కేసీఆర్ వస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, భారాస జిల్లాధ్యక్షుడు ముజీబొద్దిన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రతో పార్టీకి పూర్వవైభవం వస్తుందనే నమ్మకంతో పార్టీశ్రేణులు ఉన్నారు. మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఈ రోడ్షోకు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారనే దానిపై జిల్లాకేంద్రం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ మార్గంలోనే..
కేసీఆర్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్ర ద్వారా నిజాంసాగర్ చౌరస్తాకు చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్- సిరిసిల్ల రోడ్- పొట్టిశ్రీరాములు విగ్రహం రోడ్డు మీదుగా జయప్రకాశ్ విగ్రహం వరకు రోడ్షో సాగనుంది. అక్కడే ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో మాట్లాడనున్నారు. తర్వాత మెదక్లో జరిగే రోడ్షోకు బయలుదేరి వెళ్లనున్నారు.
ప్రియాంక సభకు భారీ ఏర్పాట్లు
ప్రియాంక సభకు కాంగ్రెస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నుంచి భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుతున్నారు. మధ్యాహ్నం సమావేశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రతినిధులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
సీఎం హోదాలో మొదటిసారి జిల్లాకు
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ముఖ్యనేతలు, మేధావులు, ఇతరత్రా వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గంలో సమకూర్చాల్సిన మౌలిక వసతులు, ఇతరత్రా అవసరాలపై నివేదికను షబ్బీర్అలీ రూపొందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈఏపీసెట్లో మెరిసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు
[ 19-05-2024]
రాష్ట్రంలో శనివారం వెల్లడించిన ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్టపడి చదివి ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మొక్కల పెంపకానికి విత్తనాల సేకరణ
[ 19-05-2024]
అడవుల్లో పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
[ 19-05-2024]
వేసవి సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో నిర్వహించే అన్ని శిబిరాల్లో క్రీడాకారులు కిక్కిరిసిపోతున్నారు. -
ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలేవి
[ 19-05-2024]
పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి వాడి పడేసే(సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 19-05-2024]
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం పిట్లం మండలం గౌరారం తండాలో చోటుచేసుకుంది. -
‘రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
[ 19-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతినని చెప్పుకొంటూ వారిని మోసం చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. -
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
[ 19-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. -
గ్రూప్-1 నిర్వహణకు 12 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 12 కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం.. సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. గడిచిన వానాకాలం చీడపీడలు, తెగుళ్లతో పంట దిగుబడులు రాక కర్షకులకు నష్టాలే మిగిలాయి. -
లక్ష్యం శతశాతం
[ 19-05-2024]
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్