logo

భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలి

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు...

Updated : 07 May 2024 15:36 IST

నాగిరెడ్డిపేట: ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీ నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం స్థానిక నాయకులు ఉపాధి హామీ పనులు చేస్తున్న తాండూరు అక్కంపల్లి ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ ఇచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ నాయకత్వంలో జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గత పదేళ్లుగా మోదీ భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెట్టాలని, రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలోని భాజపాను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు బండ బాబు, రామానుజం, మా దాస్ నందు, సాయిలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని