logo

పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన పనులను పాఠశాలలు తెరిచే లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

Published : 07 May 2024 17:43 IST

కామారెడ్డి పట్టణం: అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన పనులను పాఠశాలలు తెరిచే లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం టేక్రియాల్లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను, మున్సిపాలిటీ నర్సరీని, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టును ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి పాఠశాలలో చేపడుతున్న మరమ్మత్తు, ప్రహరీ గోడ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. జిల్లా చెక్ పోస్టును సందర్శించి స్టాస్టిక్స్ సర్వేలెన్స్ బృందంతో మాట్లాడుతూ ప్రతి వాహనాన్ని నిశితంగా తనిఖీ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారులు సుబ్బారాయుడు, శంకర్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు