నినాదం.. చైతన్యం
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు.
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఓటు హక్కు కలిగి ఉన్నవారందరూ హక్కు వినియోగించేలా చైతన్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల బ్యానర్లు కట్టి అవగాహన కల్పిస్తున్నారు. ‘నా ఓటే - నా భవిష్యత్తు, మన ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయించే దిక్సూచి, 100 శాతం ఓటింగ్లో పాల్గొందాం.. ప్రజాస్వామ్య శక్తిని చాటుదాం’ అంటూ నినాదాలు ముద్రించి నగరంలో అనేక చోట్ల బ్యానర్లు ఏర్పాటుచేశారు.
ఈనాడు, నిజామాబాద్
భవితకు బాటలు వేద్దాం..
తాతయ్య.. తరతరాల నుంచి అభివృద్ధి చేసిందెవరో చూసి ఓటు వెయ్యు
నానమ్మ.. నాటినుంచి నేటి వరకు ఎవరు ఏం చేశారో చూసి ఓటు వెయ్యు
అమ్మమ్మ.. ఆగం కావొద్దని ఆలోచించుకో..
నాన్న.. నాయకుడెలాంటి వాడో అర్థం చేసుకో..
అమ్మ.. పనులు ఎలా చేస్తున్నారో చూసుకో
అక్క.. ఐదేండ్ల అభివృద్ధిని అడిగి మరీ ఓటు వెయ్యు
అన్న.. అన్నింటికి నీవే సాక్ష్యంగా మారు..
చెల్లి.. చెప్పేమాటల్లో నిజమెంత.. అబద్ధమెంతో చూసుకో
తమ్ముడూ.. తర్వాత జరిగే పరిస్థితులను తెలుసుకో..
కొడుకా.. కోరుకున్న నాయకున్ని గెలిపించుకో..
కోడలా.. కోటి ఆశలతో ఓటు దీపం వెలిగించుకో
బిడ్డా.. బీదాబిక్కిని కాపాడే నాయకునికే ఓటు వెయ్యు.. భవిష్యత్తుకు మంచి బాట వెయ్యు
కొత్తపల్లి భూమేశ్, మనోహరాబాద్, జక్రాన్పల్లి మండలం, నిజామాబాద్- న్యూస్టుడే, సుభాష్నగర్
ఏళ్ల తరబడి ఎన్నికలకే!
ఈ చిత్రం కోటగిరి మండలం ఎత్తొండక్యాంపులోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల భవనం. ఇది కేవలం ఎన్నికల సమయంలోనే తెరుచుకుంటుంది. గతంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ బడిలో బోధన చేసేవారు. క్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో అదే గ్రామంలో వేరే చోట విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు నిర్మించారు. అక్కడే తరగతులు జరుగుతున్నాయి. బడిని మాత్రం వివిధ ఎన్నికలకు పోలింగ్ కేంద్రంగా వినియోగిస్తున్నారు. మిగతా రోజుల్లో మూసే ఉంటుంది. ఈ నెల 13వ తేదీన జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఈ పోలింగ్ కేంద్రానికి 33 నంబరు కేటాయించారు.
న్యూస్టుడే, కోటగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల
[ 19-05-2024]
జూన్ 7 నుంచి 11 వరకు శ్రీ లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. -
రోడ్లకు మహర్దశ ఎప్పుడో..?
[ 19-05-2024]
గ్రామీణ ప్రాంతాలకు రహదారులు నిర్మించి రవాణా సౌకర్యం మెరుగుపర్చాలన్న ప్రభుత్వ లక్షం నెరవేరడం లేదు. -
ఈఏపీసెట్లో మెరిసిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు
[ 19-05-2024]
రాష్ట్రంలో శనివారం వెల్లడించిన ఈఏపీసెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. కష్టపడి చదివి ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
మొక్కల పెంపకానికి విత్తనాల సేకరణ
[ 19-05-2024]
అడవుల్లో పచ్చదనం పెంచేందుకు అటవీశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్థానికంగా నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించారు. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
[ 19-05-2024]
వేసవి సెలవుల్లో క్రీడా శిబిరాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జిల్లాలో నిర్వహించే అన్ని శిబిరాల్లో క్రీడాకారులు కిక్కిరిసిపోతున్నారు. -
ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలేవి
[ 19-05-2024]
పర్యావరణానికి పెను ప్రమాదంగా మారిన ప్లాస్టిక్ కవర్లు, వస్తువుల విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కసారి వాడి పడేసే(సింగిల్ యూజ్డ్) ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం విధించింది. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
[ 19-05-2024]
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన శనివారం పిట్లం మండలం గౌరారం తండాలో చోటుచేసుకుంది. -
‘రైతులను మోసగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం’
[ 19-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతినని చెప్పుకొంటూ వారిని మోసం చేస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. -
పాఠ్యపుస్తకాలు వస్తున్నాయ్
[ 19-05-2024]
బడులు తెరిచే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించేందుకు రాష్ట్ర విద్యాశాఖ జిల్లా కేంద్రాలకు పంపిణీ ప్రక్రియ ప్రారంభించింది. కొన్ని నెలల కిత్రమే ముద్రణ ప్రారంభించగా ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నారు. -
గ్రూప్-1 నిర్వహణకు 12 పరీక్ష కేంద్రాలు
[ 19-05-2024]
జిల్లాలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు 12 కేంద్రాలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ పేర్కొన్నారు. -
ఖరీఫ్ ప్రణాళిక సిద్ధం.. సాగుకు సన్నద్ధం
[ 19-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికలను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. గడిచిన వానాకాలం చీడపీడలు, తెగుళ్లతో పంట దిగుబడులు రాక కర్షకులకు నష్టాలే మిగిలాయి. -
లక్ష్యం శతశాతం
[ 19-05-2024]
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అనుబంధ విద్యాలయాల్లో ఇంటర్ ప్రవేశాలు పెంచేందుకు యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు