ఓటు పిలుస్తోంది.. రారండోయ్
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది.
వరుసగా మూడు రోజులు సెలవులే
న్యూస్టుడే, మోర్తాడ్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్ నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధం ఓటు మాత్రమేనని, ఈ విషయాన్ని మర్చిపోకుండా హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం స్వీప్ ఆధ్వర్యంలో 2కె, 5కె రన్ కార్యక్రమాలు, ఓటరు అవగాహన ర్యాలీలు, మహిళా సంఘాలకు ముగ్గుల పోటీలు, కరపత్రాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించింది. ఇక మిగిలింది ఓటర్ల వంతే.. ఎక్కడున్నా పోలింగ్కేంద్రం బాట పట్టి వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించి తీరాలి.
విద్యాసంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మండే ఎండల్లో చల్లని ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం కొందరి అలవాటు. అయితే 13వ తేదీ సోమవారం పోలింగ్ సందర్భంగా సెలవు కాగా దానికి ముందు రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవు. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయని ఇంటిల్లిపాదీ ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే జీవితంలో విలువైన క్షణాలను కోల్పోయి మంచి భవిష్యత్తును ఇచ్చే నాయకుడిని కోల్పోయిన వారమవుతాం. ఎక్కడున్నా ఓటేయడానికే సెలవిచ్చారని గుర్తుంచుకోవాలి. పోలింగ్కు ఒకరోజు ముందు అంటే ఆదివారమే స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి.
యువత భవిత మీదే..
దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. ఉద్యోగ, ఉపాధి కోసం చాలా మంది స్వస్థలాలకు దూరంగా పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్లి ఉంటారు. ఈసారి పోలింగ్కు ముందురోజు కూడా సెలవు వస్తున్నందున సొంత ప్రాంతాలకు చేరుకుంటే సొంత ప్రాంతంలో ఉపాధి కల్పించేనాయకుడిని ఎన్నుకోవచ్చు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుంది.
గంట పొడిగింపుతో ఉపశమనం...
ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. ఈక్రమంలో పోలింగ్ కూడా అగ్ని పరీక్షగా మారింది. భానుడి ప్రతాపాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. ఇది వృద్ధులు, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపే ఓటు వేసి రావడం ద్వారా ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటాము. అలాగే ఉదయం వీలుపడని వారు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దినాలకొచ్చి.. మృత్యు ఒడిలోకి
[ 20-05-2024]
దినాలకొచ్చి చెట్టుకు ఉరి పెట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని కాటేపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. -
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
[ 20-05-2024]
బీర్కూర్లో సోమవారం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓపెన్ జిమ్ పార్కును పరిశీలించిన బల్దియా ఛైర్ పర్సన్
[ 20-05-2024]
పట్టణంలోని గోదాం రోడ్ మున్సిపల్ ఓపెన్ జిమ్ పార్క్ ను బల్దియా ఛైర్ పర్సన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. -
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల