పాఠశాలల అభివృద్ధికి రూ.39.38 కోట్లు
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.
దొంకల్ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న మరుగుదొడ్ల మరమ్మతు పనులు
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.39.38 కోట్లు కేటాయించారు. వీటితో పనులు పూర్తి చేసే బాధ్యతను కమిటీలకు అప్పగించారు. గత నెల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ అధికారులు, పట్టణ ప్రాంతాల్లో పురపాలిక అధికారులు, పీఆర్ అధికారులు పనులకు సంబంధించి ప్రతిపాదనలు అందించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు వాటికి అమోదం తెలిపారు. పది శాతం నిధుల్ని మండలాభివృద్ధి అధికారి ఖాతాల్లోకి జమ చేయించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.
నిధుల కేటాయింపు ఇలా..
జిల్లాలో మొత్తం 1156 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలున్నాయి. అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు చేపట్టేందుకు 792 బడులను గుర్తించగా వీటిలో విద్యార్థుల నమోదు లేనివి, విలీన బడులను తొలగించారు. 739 పాఠశాలల్లో వెంటనే మరమ్మతులు అవసరమని ఇంజినీరింగ్ అధికారులు తేల్చారు. ప్రస్తుతం 549 పాఠశాలల్లో మరమ్మతులు, విద్యుత్తు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. జూన్ 10వ తేదీనాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలున్నాయి. లక్ష్యాన్ని చేరేందుకు విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఎన్నికల తర్వాత వేగం
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల పనుల్లో అధికారులు తీరిక లేకుండా ఉన్నారు. దీంతో పర్యవేక్షణ లేక కొంత నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 13న పోలింగ్ ముగిశాక పనుల్లో వేగం పెరగనుంది. గతంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో చేసిన పనులకు ఇంతవరకు నిధులు రాలేదు.
గడువులోపు పూర్తి
జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, డీఈవో దుర్గాప్రసాద్ ఆదేశాలతో అమ్మ ఆదర్శ కమిటీలతో పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాం. ప్రస్తుతం అధికారులు ఎన్నికల హడావుడిలో ఉన్నారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
శ్రీధర్రెడ్డి, ప్లానింగ్ కో ఆర్డినేటర్, జిల్లా విద్యాశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దినాలకొచ్చి.. మృత్యు ఒడిలోకి
[ 20-05-2024]
దినాలకొచ్చి చెట్టుకు ఉరి పెట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని కాటేపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. -
జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు
[ 20-05-2024]
బీర్కూర్లో సోమవారం సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
[ 20-05-2024]
బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఓపెన్ జిమ్ పార్కును పరిశీలించిన బల్దియా ఛైర్ పర్సన్
[ 20-05-2024]
పట్టణంలోని గోదాం రోడ్ మున్సిపల్ ఓపెన్ జిమ్ పార్క్ ను బల్దియా ఛైర్ పర్సన్ గడ్డ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. -
తల్లిదండ్రులూ.. తస్మాత్ జాగ్రత్త
[ 20-05-2024]
ముద్దులొలికే పాపే ఆ తల్లిదండ్రులకు పంచప్రాణాలు..కొడుకున్నా.. కూతురిపైనే మక్కువ ఎక్కువ..చిట్టితల్లికి చిన్న గాయమైనా తట్టుకోలేని హృదయాలు వారివి. అప్పటి వరకు సరదాగా గడిపిన చిన్నారిని మృత్యువు మింగేసింది. -
సజ్జ రైతు సంబరం
[ 20-05-2024]
ఎర్రజొన్నల మాదిరిగానే ఒప్పందంపై సేద్యం చేస్తున్న సజ్జ పంట ఈసారి అన్నదాతల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి రావడం, ధర అమాంతం రూ.2 వేలు పెరగడంతో సాగుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రూ.వేయి కోట్ల కొనుగోళ్లు
[ 20-05-2024]
దేశంలో పసుపు కొనుగోళ్లలో ప్రత్యేక స్థానం ఉన్న నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈసారి సుమారు రూ. వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గినప్పటికీ కొనుగోళ్లలో వృద్ధి కనిపించింది. -
‘గెలుపు మనదే’
[ 20-05-2024]
జహీరాబాద్ పార్లమెంటు స్థానంలో గెలుపు మనదేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. సదాశివనగర్ మండల కాంగ్రెస్ నాయకులతో ఆదివారం ఆయన పోలింగ్ సరళి, గ్రామాల వారీగా కాంగ్రెస్కు పడిన ఓట్ల వివరాలపై ఆరా తీశారు. -
టీఎస్ కాస్తా టీజీగా..
[ 20-05-2024]
తెలంగాణ సంక్షిప్త రూపం ఇది వరకు టీఎస్గా ఉండేది. అది కాస్తా టీజీగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి నివేదికలు, ప్రభుత్వ ఉత్తర్వులు, లెటర్ హెడ్లపై టీఎస్కి బదులు టీజీగా పేర్కొనాలని వెల్లడించింది. -
పర్యాటకంగా మారిస్తే.. ప్రయోజనాలెన్నో!
[ 20-05-2024]
నిజామాబాద్ గ్రామీణ మండలం మల్కాపూర్ గ్రామ శివారులోని స్వయంగా వెలసిన అనంత పద్మనాభ స్వామి ఆలయానికి గుర్తింపు లభించడం లేదు. చెరువు గట్టున పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన ఆలయం ఇది. -
ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు వేళాయె
[ 20-05-2024]
తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైనవారిలో అత్యధికులు ఇంటర్మీడియెట్ వైపు దృష్టి సారిస్తారు. అలాంటి వారికి ఆదర్శ జూనియర్ కళాశాలలు వరమనే చెప్పాలి. -
చూసి కొనాలి.. రసీదు పొందాలి
[ 20-05-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. ముందస్తుగానే వానలు వచ్చే అవకాశం ఉండటంతో రైతులు నాణ్యమైన విత్తన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పల్లె పోరుకు సన్నాహాలు
[ 20-05-2024]
అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడుతోంది. సర్పంచుల పదవీకాలం జనవరి 31వ తేదీతో ముగిసింది.
తాజా వార్తలు (Latest News)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల