2024 ఒడిశాలో కమలం వికసించాలి
బిజదకు దిల్లీలో బాస్లు లేరని, నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వారి యజమానులని ఆ పార్టీ పెద్దలు అంటున్నారని, వాస్తవానికి హస్తినలో సేవకులు పాలిస్తున్నారని, 130 కోట్ల ప్రజల బాస్ జగన్నాథుడన్న వాస్తవాన్ని
ఇప్పటి నుంచే భాజపా కార్యకర్తలు ఉద్యమించాలి
7 మోర్చాల ప్రతినిధులకు నడ్డా ఉద్బోధ
నడ్డాకు జగన్నాథుని ఫోటో బహూకరిస్తున్న ధర్మేంద్ర, సమీర్లు
భువనేశ్వర్, న్యూస్టుడే: బిజదకు దిల్లీలో బాస్లు లేరని, నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వారి యజమానులని ఆ పార్టీ పెద్దలు అంటున్నారని, వాస్తవానికి హస్తినలో సేవకులు పాలిస్తున్నారని, 130 కోట్ల ప్రజల బాస్ జగన్నాథుడన్న వాస్తవాన్ని బిజద నేతలు విస్మరిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. భువనేశ్వర్ జనతా మైదానంలో శుక్రవారం (రెండో రోజు) భాజపా యువ, మహిళా, ఛాత్ర, మైనార్టీ, కృషక్, ఎస్సీ, ఎస్టీ మోర్చా కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది.
సైనికుల్లా ఉద్యమించండి
రాష్ట్రంలో ఉత్తమ పాలన, అందరికీ సమాన న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయం నెరవేరాలంటే ఇక్కడ భాజపా అధికారంలోకి రావాలన్నారు. ఈ దిశగా 7 మోర్చాల కార్యకర్తలు సైనికుల్లా ఉద్యమించాలన్నారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు ప్రజలకు వివరించి ఇక్కడి అవినీతి పాలన, వైఫల్యాలు చాటి చెప్పాలన్నారు. భాజపాలో సభ్యత్వాలు పెంచాలన్న నడ్డా 2024లో ఒడిశాలో కమల వికాసం తధ్యమన్నారు డబుల్ ఇంజిన్ పాలన ధ్యేయంగా కార్యకర్తలు కలిసిమెలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సమీర్ మహంతి ఇతర నాయకులు ప్రసంగించారు.
బిష్ణుశెఠికి శ్రద్ధాంజలి
ఉదయం భద్రక్ జిల్లా తిహిడి చేరుకున్న నడ్డా భాజపా సభాపక్షం ఉపనేత బిష్ణుశెఠి మృతికి సంతాపం తెలిపారు. శెఠి కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన ఆయన పార్టీ అండగా ఉంటుందన్నారు. తిహిడి కళాశాల ఆవరణలో ఏర్పాటైన సంతాపసభలో పాల్గొన్న నడ్డా సాహితీ, రాజకీయ రంగాల్లో శెఠి చేసిన సేవలు ప్రస్తుతించారు. తర్వాత కటక్ జిల్లా ఒలటపూర్లో ఏర్పాటైన ఆసుపత్రి భవనాన్ని నడ్డా ప్రారంభించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్