పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది.
బిజు కార్డును చూపిస్తున్న మిధున్ దంపతులు
జయపురం, న్యూస్టుడే: బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... రాయ్ఘర్ సమితి గోన పంచాయతీ డీఎన్కే గ్రామానికి చెందిన మిధున్ హల్దార్ కుమారుడు పీయూష్కు రెండు రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో నవరంగపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్ శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. తన వద్ద బిజూ కార్డు ఉందని చికిత్స ప్రారంభించాలని మిధున్ చెప్పడంతో గురువారం ఆపరేషన్కి సిద్ధం చేశారు. బిల్లు చెల్లిస్తున్న సమయంలో కార్డు పని చేయలేదు. ఆసుపత్రి సిబ్బంది వైద్యులకు తెలియజేయడంతో ఆపరేషన్ నిలిపేశారు. ఆర్థిక స్థోమత లేక మిధున్ కుమారుడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ కార్డులు మే తర్వాత యాక్టివ్ అవుతాయని తెలుసుకున్న మిధున్ గురువారం మీడియాతో మాట్లాడుతూ పనికిరాని కార్డులు ఎరవేసి బిజద ఓట్లు అడుక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డులు మే నుంచి పనిచేస్తే సిట్టింగ్ ఎంపీ రమేష్ చంద్ర మాఝి, జిల్లా బిజద అధ్యక్షుడు నవీన్ నాయక్ ఫిబ్రవరిలో ఎందుకు ప్రజలకు అందజేశారని ప్రశ్నించారు. యంత్రాంగం తనిఖీలు నిర్వహించి కార్డులు తక్షణం పని చేసేలా చేయాలని, ఇందుకు తగు చర్యలు తీసుకోవాలని, తన కుమారుడి చికిత్స కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబ కధా చిత్రం
[ 05-05-2024]
విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు -
నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. -
శాలినీ పండిత్కు మిషన్శక్తి బాధ్యతలు
[ 05-05-2024]
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాలినీ పండిత్కు ప్రభుత్వం మిషన్శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. -
చెమటోడుస్తున్న అభ్యర్థులు
[ 05-05-2024]
ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు -
అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
[ 05-05-2024]
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. -
ఏడుగురు అభ్యర్థులకు నేర చరిత్ర
[ 05-05-2024]
ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్, కలహండి, కొరాపుట్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
రాయగడ జిల్లా కాంగ్రెస్లో అయోమయం
[ 05-05-2024]
ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అభివృద్ధికి ఓటేసి మద్దతివ్వండి
[ 05-05-2024]
కొరాపుట్ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
[ 05-05-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్