రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది.
ప్రతాప్, శ్రీకాంత్, లేఖశ్రీల మధ్య ముక్కోణ పోరు
అందరి దృష్టి బాలేశ్వర్ లోక్సభ స్థానంపైనే
భువనేశ్వర్, న్యూస్టుడే: రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. ఇది రాష్ట్ర ప్రజలందరి దృష్టినీ అకర్షిస్తోంది. ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు. విజయలక్ష్మి ఎవరి సొంతమవుతుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.
అందరి బంధువు ప్రతాప్
బాలేశ్వర్ సిటింగ ఎంపీ ప్రతాప్చంద్ర షడంగి అందరి బంధువుగా ముద్రపడ్డారు. ఆధ్యాత్మిక భావాలు గల ఆయనను సర్వసంగ పరిత్యాగిగా అందరూ పేర్కొంటారు. దిగజారుడు రాజకీయాలకు దూరంగా, ప్రజలకు చేరువగా ఉంటారు. డాబు, దర్పం లేని ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ అభిమానిస్తారు. బాలేశ్వర్ వాసులు ప్రతాప్ను ‘అన్నయ్య’గా ‘గురు’గా పిలుస్తారు. గడిచిన అయిదేళ్లు ఎంపీగా, కొన్నాళ్లు కేంద్ర సహాయ మంత్రిగా శ్రద్ధతో విధులు నిర్వహించిన ఆయన రెండోసారి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రతాప్ ప్రచారం సాదాసీదాగా జరుగుతోంది. ఎలాంటి అట్టహాసం లేదు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఏడు పదుల ప్రాయంలో సైకిల్పై గ్రామాల్లో పర్యటిస్తూ తనకు మరోసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నారు. జన్మభూమికి సేవచేసే అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు.
మోదీ గ్యారంటీ అండగా ఉంది
గురువారం బాలేశ్వర్లోని నీలగిరిలో ప్రచారం చేసిన ప్రతాప్ విలేకరులతో మాట్లాడుతూ... జనం అండదండలు, మోదీ గ్యారంటీ తన విజయానికి తారక మంత్రమని చెప్పారు. అధికారం కోసం సిద్ధాంతాలకు పాతరేసే వారికి ఓటర్లు బుద్ధి చెబుతారని పరోక్షంగా లేఖశ్రీ సామంతని విమర్శించారు.
తొలిసారి ఎన్నికల బరిలో: లేఖశ్రీ సామంత శింగార్ రాష్ట్ర ప్రజలకు చిరపరిచితురాలు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె గతంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచి ఆరెస్సెస్ సిద్ధాంతాలు జీర్ణించుకున్న ఆమె ఉద్యోగం వదులుకుని భాజపాలో చేరి అగ్రనేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీలో ‘ఫైర్బ్రాండ్’గా ముద్ర పడిన ఆమె గడిచిన పదేళ్లు నవీన్ ప్రభుత్వ వైఫల్యాలు కడిగేశారు. ఊహించని విధంగా ఈసారి ఎన్నికల ముందుగా కాషాయం కండువా పడేసి బిజద గూటికి చేరారు. దీంతో ఆమెను సీఎం బాలేశ్వర్ లోక్సభ అభ్యర్థిగా చేశారు. రాజకీయాల్లో రాటుదేలిన ఆమె తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. నవీన్ అండదండలతో బాలేశ్వర్ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తెస్తానని, లోక్సభలో రాష్ట్ర ప్రజల వాణి వినిపిస్తానని, తనను గెలిపించాలని కోరుతున్నారు.
ప్రతిభాశాలి: శ్రీకాంత్ జెనా... రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిభాశాలిగా గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా విధులు నిర్వహించారు. గొప్ప వ్యూహకర్తగా గౌరవం అందుకున్నారు. ప్రలోభాలకు లొంగరని, విలువలకు కట్టుబడతారని పార్టీ నేతలంటారు. కాంగ్రెస్లో నాటి సిద్ధాంతాలకు నాయకులు తిలోదకాలిచ్చారని, వ్యక్తి పూజలకు పెద్ద పీట వేస్తున్నారన్న అసంతృప్తితో కొన్నాళ్లు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయని ఆయన ఈసారి పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా బాలేశ్వర్లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
నా గురించి ఓటర్లకు తెలుసు: శ్రీకాంత్ బాలేశ్వర్లోని భస్తా ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ...తన గురించి ఓటర్లకు తెలుసని, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు. జనం మళ్లీ తనను కోరుకున్నారని, పోటీ చేయాలని అందరూ కోరడంతో బరిలోకి దిగిన తనకు ఓటర్లు ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం ఉందన్నారు.
అభివృద్ధే నా అజెండా: బాలేశ్వర్లోని బలియాపాల్ ప్రాంతంలో లేఖశ్రీ విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధే అజెండాగా చేసుకున్న తనకు నవీన్ అండగా నిలిచారని, ఆయనతో రానున్న అయిదేళ్లు కలిసి పనిచేసి జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నది తన జీవితాశయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వాయర్లో మునిగి ముగ్గురు మృతి
[ 04-05-2024]
ఉక్కు నగరం రక్షణ రిజర్వాయర్లో శనివారం సాయంత్రం విషాధ ఛాయలు అలుముకున్నాయి. కేతా నది రిజర్వాయర్లో ముగ్గురు యువకులు మునిగి మృతి చెందారు. -
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ