నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు.
భాజపాకు అయిదేళ్లు అవకాశమివ్వండి
సోన్పూర్ భాజపా సంకల్ప సమావేశంలో అమిత్షా
ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్షా
భువనేశ్వర్, న్యూస్టుడే: సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం సోన్పూర్లోని రామేశ్వర్ మైదానంలో రాష్ట్ర భాజపా నాయకత్వం చేపట్టిన విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న షా నవీన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 25 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఏం సాధించారు? ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం పురోగతి బాట పట్టిందని జమ్ము కాశ్మీరానికి 370వ అధికరణ రద్దుతో స్వేచ్ఛకు బాటలు పడ్డాయన్నారు. దీర్ఘకాలంగా నలిగిన అయోధ్య రామజన్మభూమిలో దేదీప్యమైన రామాలయ నిర్మాణం జరిగిందని, పాకిస్థాన్ తిరుగుబాటుదారులకు, ఉగ్రవాద శక్తులను తిప్పికొట్టారని, మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు.పేదలకు కేంద్రం ఉచితంగా బియ్యం కేటాయిస్తే ఇది తామే ఇస్తున్నామని నవీన్ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారన్నారు.
వలసలు నివారిస్తాం: రాష్ట్రం నుంచి ముంబయి, గుజరాత్, దిల్లీ బెంగళూరు ప్రాంతాలకు తరలుతున్నారని, భాజపా అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలు ఆపుతామన్నారు.
పూరీకి అంతర్జాతీయ ఖ్యాతి: భాజపా అధికారంలోకి వస్తే పూరీ శ్రీక్షేత్రాన్ని కాశీ విశ్వనాథ్ క్షేత్రం తరహాలో అభివృద్ధి, సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తామన్నారు.
20 లోక్సభ సీట్లు అవసరం: ఈసారి కేంద్రంలో ఏన్డీయేకు 400 సీట్లు అవసరమని మోదీ పునరుద్ఘాటిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు 20 లోక్సభ స్థానాల్లో విజయం చేకూర్చాలని డబుల్ ఇంజిన్ పాలనకు ఓట్లేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుటుంబ కధా చిత్రం
[ 05-05-2024]
విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు -
నేడు ప్రధాని మోదీ భువనేశ్వర్ రాక
[ 05-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు భువనేశ్వర్ చేరుకోనున్నారు. రాత్రి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. -
శాలినీ పండిత్కు మిషన్శక్తి బాధ్యతలు
[ 05-05-2024]
రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శాలినీ పండిత్కు ప్రభుత్వం మిషన్శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. -
చెమటోడుస్తున్న అభ్యర్థులు
[ 05-05-2024]
ఒకవైపు తరుముకొస్తున్న పోలింగు తేదీ.. మరోవైపు సుర్రుమంటున్న సూరీడు.. అభ్యర్థులు మండుటెండల్ని లెక్కచేయకుండా విజయమే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునేందుకు చెమటోడుస్తున్నారు -
అందరి కళ్లూ ‘హింజిలి’పైనే..
[ 05-05-2024]
రాష్ట్రంలోని అందరి దృష్టి గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ‘హింజిలి’పైనే ఉంది. -
ఏడుగురు అభ్యర్థులకు నేర చరిత్ర
[ 05-05-2024]
ఈ నెల 13న రాష్ట్రంలోని బ్రహ్మపుర, నవరంగపూర్, కలహండి, కొరాపుట్ లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. -
రాయగడ జిల్లా కాంగ్రెస్లో అయోమయం
[ 05-05-2024]
ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. -
అభివృద్ధికి ఓటేసి మద్దతివ్వండి
[ 05-05-2024]
కొరాపుట్ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత
[ 05-05-2024]
గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు