ఝార్సుగుడలో రాజకీయకోలాహలం
ఝార్సుగుడలో ఉపఎన్నిక భేరీ మోగడంతో రాజకీయ కోలాహలం మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.
బలాలు, బలహీనతలపై దృష్టి సారించిన పార్టీలు
విజయావకాశాలపై అగ్రనేతల ధీమా
భువనేశ్వర్, న్యూస్టుడే: ఝార్సుగుడలో ఉపఎన్నిక భేరీ మోగడంతో రాజకీయ కోలాహలం మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. బలాలు, బలహీనతలపై దృష్టి సారించాయి. 2024 సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఝార్సుగుడ ఉప ఎన్నికను సెమీ ఫైనల్ పోరుగా భావిస్తున్నారు. అన్ని పార్టీలు విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
కమల వికాసం తథ్యం
పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బూత్ స్థాయిలో భాజపాకు బలమైన శ్రేణులున్నాయి. ఆ పార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శి టంకధర్ త్రిపాఠికి ఝార్సుగుడ నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్ఠలున్నాయి. పారిశ్రామిక సంస్థలు, కార్మిక సంఘాలతో సత్సంబంధాలున్నాయి. ఆయనకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసిస్తున్న పార్టీ నాయకత్వం టంకధర్ను బరిలోకి దించాలన్న ధ్యేయంతో ఉంది. భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్ మాఝి బుధవారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఖనిజ సంపదల నిలయమైన ఝార్సుగుడ ప్రాంతాల్లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు నామమాత్రంగా ఉన్నందున సానుభూతి పని చేయదన్నారు. భాజపాకు బలమైన క్యాడర్, ప్రజాదరణ ఉన్నందున పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారన్నారు.
సానుభూతి, అభివృద్ధి పనులు
మాజీమంత్రి నబకిశోర్ దాస్ హత్యతో ఆయన కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఉందని బిజద నేతలు చెబుతున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఝార్సుగుడ నుంచి పోటీ చేసి గెలిచిన నబకిశోర్ 2019 ఎన్నికల ముందు బిజదలో చేరి ఆ పార్టీ టిక్కెట్తో బరిలోకి దిగి హ్యాట్రిక్ సాధించారు. తన హయాంలో అభివృద్ధి పనులు చేశారు. ప్రజాదరణ ఉన్న నేతగా నిరూపించుకున్నారు. బిజద విజయానికి ఇదంతా కలిసొస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో బలంగా ఉంది. బుధవారం రాత్రి బిజద ఉపాధ్యక్షుడు దేవీ ప్రసాద్ మిశ్ర భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ.. పద్మపూర్ మాదిరిగా ఝార్సుగుడలో భారీ ఆధిక్యతతో బిజద విజయం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారని, ఆ వెంటనే ప్రచారం ప్రారంభిస్తామన్నారు.
సంతోష్ సింగ్ నాయకత్వంలో సంఘం
నబకిశోర్ దాస్ 2019లో కాంగ్రెస్ వీడిన తర్వాత ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేదు. కొంతమంది కార్యకర్తలు బిజదలో చేరారు. ప్రస్తుత ఝార్సుగుడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ మిశ్రా ఈసారి పోటీ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ బుధవారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ.. కంటాబంజి ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో పరిశీలన సంఘం ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘం ఝార్సుగుడలో పరిస్థితి అధ్యయనం చేసి అభ్యర్థిగా ఎవరిని నిలపాలో నివేదిక ఇస్తుందన్నారు. తర్వాత అధిష్ఠానం అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటిస్తుందన్నారు. క్షీణించిన శాంతిభద్రతలు, తాగునీటి ఎద్దడి, నిరుద్యోగం, అన్నదాతల ఇబ్బందులను కాంగ్రెస్ ప్రచారాస్త్రాలుగా చేస్తుందన్నారు. విజయంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్