logo

ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?

స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్‌ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్‌పూర్‌ లోక్‌సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్‌ దాస్‌  (బొబి) పేర్కొన్నారు.

Published : 27 Apr 2024 05:56 IST

కుచిండ ఎన్నికల సభలో మాట్లాడుతున్న బొబి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్‌ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్‌పూర్‌ లోక్‌సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్‌ దాస్‌  (బొబి) పేర్కొన్నారు. శుక్రవారం సంబల్‌పూర్‌ పరిధిలోని కుచిండలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ సీఎంగా నవీన్‌ అమలు చేసినన్ని సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదన్నారు. అందుకే ఆయనను రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. పదేళ్లు కేంద్రమంత్రిగా విధులు నిర్వహించిన ధర్మేంద్ర మాతృ భూమికి ఏం చేశారని ప్రశ్నించారు. కటక్‌-సంబల్‌పూర్‌ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నా నిస్సహాయంగా చూస్తున్న ధర్మేంద్ర సీఎంను విమర్శించడం హాస్యాస్పదమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని