బిజదలో చేరికలు
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.
వార్డు ప్రజలతో కలిసి బిజదలో చేరిన సనాతన సాహు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఆయనకు బ్రహ్మపుర అసెంబ్లీ బిజద అభ్యర్థి డాక్టర్ రమేష్చంద్ర చ్యవుపట్నాయక్ పూలమాలలు వేసి పార్టీలోకి స్వాగతించారు. ఇంతకుముందు సాహు కాంగ్రెస్ గంజాం జిల్లా యువ విభాగంలో వివిధ పదవుల్లో సేవలు అందించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి గమనార్హం.
చైతన్య కుల ధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు
సిమిలిగుడ, న్యూస్టుడే: కొరాపుట్ జిల్లా పొట్టంగి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చైతన్య హంటల్ కుల ధ్రువీకరణ పత్రంపై రెవెన్యూ, పోలీస్ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. నందపూర్ ఎస్డీపీవో సంబిత్ కుమార్ మాఝి అందించిన వివరాల ప్రకారం.. చైతన్య హంటల్కు భాజపా టికెట్ లభించింది. ఆయన దళితుడైనా ఆదివాసీ కుల ధ్రువీకరణ పత్రంతో ఈ టికెట్ దక్కించుకున్నట్లు ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. టికెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఇది వివాదంగా మారడంతో భాజపా ఆయనకు టికెట్ రద్దు చేసింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ వివాదానికి సంబంధించి మాచ్ఖండ్ తహసీల్దార్ దివాకర్ భాగ్కు ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు టెంటులి పొదొరో గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. చైతన్య దళితుడని ఆధారాలు లభించడంతో నివేదిక తహసీల్దార్కు అందజేశారు. ఆయన ఆదివాసీగా చూపించిన కుల ధ్రువీకరణ పత్రం నకిలీదిగా గుర్తించిన తహసీల్దార్ శుక్రవారం నందపూర్ ఠాణాలో ఫిర్యాదు చేసి చైతన్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఠాణా అధికారిని మమతా పండా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారం రోజుల్లో ఠాణాలో హాజరుకావాలని చైతన్యకు నోటీసు జారీ చేశారు.
సామాజిక మాధ్యమాలే.. ప్రచారాస్త్రాలు
తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థులు
బ్రహ్మపుర బజారు, న్యూస్టుడే: ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వివిధ పార్టీల లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. ఈ మాధ్యమం ద్వారా ప్రతీ ఒక్కరి వద్దకు తమ అభ్యర్థనలు చేరవేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, వాయిస్ మెసేజ్లు, ఎక్స్ వేదికల ద్వారా హామీలు గుప్పిస్తూ తమను గెలిపించాలంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. తమను చూసి కాదని, తమ నేతలు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యర్థించడం గమనార్హం. ఓటర్లను ఆకర్షించేలా అభ్యర్థులు, వారి మద్దతుదారులు సినీ, జానపద రీతుల్లో పాటలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. బ్రహ్మపుర లోక్సభ, గోపాలపూర్ అసెంబ్లీ బిజద, భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉమ్మరికోట్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పర్యటన
[ 08-05-2024]
అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఛత్తిస్గఢ్ సీఎం అన్నారు. సీఎం నవీన్ పట్నాయక్ పాలనలో అధికారులు ప్రజలకు సేవలు చేయటంలో నిరక్ష్యంగా వ్యవహరిస్తున్నారి నవరంగపూర్ జిల్లా ఉమ్మారికోట్లో బుధవారం జరిగిన భాజపా బహిరంగ సమావేశంలో హాజరైన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణదేవ్ సాయి అన్నారు. -
3.778 కిలోల బంగారం స్వాధీనం
[ 08-05-2024]
భువనేశ్వర్ విమానాశ్రయంలో బుధవారం సాయింత్రం 3.77 కిలోల బంగారం పట్టుబడింది. దీని విలువ 2.79 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. -
ఐదుగురు యువకులు అరెస్టు
[ 08-05-2024]
బ్రహ్మపుర బైద్యనాథపూర్ (బిఎన్.పూర్) ఠాణా పరిధిలో 17 ఏళ్ల బాలికకు మత్తు కలిపిన శీతల పానీయం ఇచ్చి సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. -
నెలకు 39 వేల పని దినాలు
[ 08-05-2024]
ఈ ఆర్థిక సంవత్సరంలో జయపురం సమితికి నెలకి 34 వేల 481 పని దినాలు కల్పించనున్నట్టు జిల్లా అధికార యంత్రాంగం పేర్కొంది. -
పాఠశాల నిర్మించుకుంటే.. ఎన్నికల బహిష్కరణ
[ 08-05-2024]
40 ఏళ్ల క్రితం నిర్మించిన పాఠశాల మరమ్మతులకు గురైందని పలుమార్లు అధికారులు, రాజకీయ నేతల దృష్టికి తీసుకెళ్ళిన ఫలితం లేకపోయిందని స్థానికులు వాపోయారు. -
9 మంది మావోయిస్టుల లొంగుబాటు
[ 08-05-2024]
న్యుమరిండి బేధ జిల్లా ఎస్పీ కార్యాలయంలో దక్షిణ మండల ఐజీ జయనారాయణ పంకజ్ సమక్షంలో బుధవారం 9 మంది మావోస్టులు లొంగిపోయారు. -
మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
[ 08-05-2024]
తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని గంజాం జిల్లా బ్రహ్మపురం బీన్పూర్ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మా అమ్మాయికే మీ ఓటు..!
[ 08-05-2024]
ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. -
సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
[ 08-05-2024]
భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్సభ అభ్యర్థి బైజయంత్ పండా చెప్పారు. -
65 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్
[ 08-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. -
భాజపా తరఫున ప్రచారానికి ‘హేమ’హేమీలు
[ 08-05-2024]
బాలీవుడ్ స్టార్ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. -
నువ్వా... నేనా
[ 08-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోపాల్పూర్లో బిజద బల ప్రదర్శన
[ 08-05-2024]
గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. -
బిజద ఆరిపోతున్న దీపం: ధర్మేంద్ర
[ 08-05-2024]
రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్ రిమోట్ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. -
అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం
[ 08-05-2024]
పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
Japan: జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
ఐఎఫ్ఎస్ తుది ఫలితాలు వచ్చేశాయ్.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
ఆస్ట్రేలియాలో చదువు.. బ్యాంకు బ్యాలెన్స్ రూ.16 లక్షలు ఉండాల్సిందే!
-
రెండు రోజులపాటు తెలంగాణలో వర్షాలు