5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
భువనేశ్వర్, న్యూస్టుడే: రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. ఇది మే 3 వరకు కొనసాగనుంది. 4న పరిశీలన, 6న ఉపసంహరణ జరగనుంది.
అసెంబ్లీకి 266 మంది
తొలివిడత నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. కొరాపుట్ లోక్సభ స్థానంలో అత్యధికంగా 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బ్రహ్మపుర, కలహండి స్థానాల్లో 11 మంది చొప్పున, నవరంగపూర్కు నలుగురు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు లోక్సభ స్థానాల పరిధుల్లో 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో 266 మంది నామినేషన్లు వేశారు. బ్రహ్మపుర శాసనసభ బరిలో అత్యధికంగా 20 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా అమ్మాయికే మీ ఓటు..!
[ 08-05-2024]
ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. -
సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
[ 08-05-2024]
భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్సభ అభ్యర్థి బైజయంత్ పండా చెప్పారు. -
65 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్
[ 08-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. -
భాజపా తరఫున ప్రచారానికి ‘హేమ’హేమీలు
[ 08-05-2024]
బాలీవుడ్ స్టార్ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. -
నువ్వా... నేనా
[ 08-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోపాల్పూర్లో బిజద బల ప్రదర్శన
[ 08-05-2024]
గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. -
బిజద ఆరిపోతున్న దీపం: ధర్మేంద్ర
[ 08-05-2024]
రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్ రిమోట్ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. -
అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం
[ 08-05-2024]
పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.