రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు.
మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయి
ఉద్యమిస్తే భాజపాకు అధికారం తథ్యం: అమిత్ షా
వేదికపై అమిత్షా, భూపేంద్ర, మన్మోహన్ తదితరులు
భువనేశ్వర్, న్యూస్టుడే: కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. రాత్రి భువనేశ్వర్లో అగ్రనేతలకు విజయ తారక మంత్రం బోధించారు. రెండు గంటలు నేతలతో చర్చించిన కేంద్రమంత్రి మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.
బలం, బలహీనతలపై విశ్లేషణ: రాష్ట్రంలో భాజపా బలం, బలహీనతలపై విశ్లేషించారు. గతసారి ఎన్నికల్లో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా చాలా తక్కువ ఓట్లతేడాతో ఓటమి పాలైంది. పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్, సంబల్పూర్, కలహండి, సుందర్గఢ్, బరగఢ్ లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన కమలం అసెంబ్లీ సెగ్మెంట్లలో చతికిలపడింది. పోగొట్టుకున్న సీట్లు ఈసారి నిలబెట్టుకోవడం ధ్యేయం కావాలని షా ఉద్బోధించినట్లు తెలిసింది. శాసనసభలో 90 స్థానాలకు తగ్గకూడదని లక్ష్యం విధించారు.
నాటి ఆదరణ లేదు: 25 ఏళ్ల నవీన్ పాలనలో ప్రగతి శూన్యం, ప్రచారం మినహా ఒరిగిందేమీ లేదన్న వ్యతిరేకత ఓటర్లలో ఉందని నేతలు షాకు వివరించారు. వ్యవసాయరంగం, ఉపాధి కల్పన రంగాల్లో బిజద పాలకులు విఫలయమ్యారని, సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలి నియోజకవర్గం వలసలకు చిరునామాగా మారిందని చెప్పారు. ఈసారి నవీన్ పోటీ చేయాలని నిర్ణయించుకున్న కంటాబంజి వలసల్లో రికార్డు సృష్టించిందని, సాగు, తాగునీటి సరఫరా గ్రామీణ రహదారుల నిర్మాణం చేయలేదన్నారు.
ప్రతి ఇంటికీ ఛార్జిషీట్ ప్రతులు: నవీన్ 25 ఏళ్ల పాలనా వైఫల్యాలు, అవినీతికి సంబంధించి భాజపా నాయకత్వం ఛార్జిషీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతులు ప్రతి ఇంటికి చేర్చాలని షా నేతలకు సూచించారు. పశ్చిమ ఒడిశాపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మత్తు మందు ఇచ్చి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
[ 08-05-2024]
తనపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని గంజాం జిల్లా బ్రహ్మపురం బీన్పూర్ ఠాణా పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మా అమ్మాయికే మీ ఓటు..!
[ 08-05-2024]
ఈసారి ఎన్నికల్లో పలువురు నేతలు తమ కుమార్తెలను పోటీలో నిలిపారు. అసెంబ్లీ స్థానాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు వీరికి 33 శాతం సీట్లు కేటాయించలేకపోయాయి. బిజద 35 మందికి అవకాశమిచ్చి ఇతర పార్టీల కంటే ముందంజలో ఉంది. -
సంక్షేమ కార్యక్రమాలు ఆగవు
[ 08-05-2024]
భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్సభ అభ్యర్థి బైజయంత్ పండా చెప్పారు. -
65 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు పెండింగ్
[ 08-05-2024]
రాష్ట్రంలో తొలిదశలో మే 13న నిర్వహించనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం అభ్యర్థుల్లో 65 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరిలో 48 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. -
భాజపా తరఫున ప్రచారానికి ‘హేమ’హేమీలు
[ 08-05-2024]
బాలీవుడ్ స్టార్ హేమమాలిని భాజపా తరఫున రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. -
నువ్వా... నేనా
[ 08-05-2024]
ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కొరాపుట్ నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంటోంది. బిజద, కాంగ్రెస్, భాజపాలు విజయం సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోపాల్పూర్లో బిజద బల ప్రదర్శన
[ 08-05-2024]
గాలివానలో అమ్మోరు జాతరను తలపించిన వి.కార్తికేయ పాండ్యన్ రోడ్షో దీనికి వేదికైంది గోపాల్పూర్ సెల్ఫీ పాయింట్ కూడలిలో సోమవారం రాత్రి బిజద నాయకత్వం బల ప్రదర్శన చేపట్టారు. -
బిజద ఆరిపోతున్న దీపం: ధర్మేంద్ర
[ 08-05-2024]
రాష్ట్రాన్ని రెండు పుష్కరాలుగా పాలిస్తున్న సీఎం నవీన్ రిమోట్ చెప్పిందే చేస్తారని, అండలేనిదే ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. -
అనుకూలించిన వాతావరణం.. అభ్యర్థుల్లో ఉత్సాహం
[ 08-05-2024]
పోలింగు తేదీ దగ్గరపడింది. ప్రచారానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. ఇటీవల తీవ్ర ఎండల కారణంగా ఉదయం, సాయంత్రం, రాత్రివేళల్లో అభ్యర్థులు ప్రచారం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి
-
‘ఉద్యోగం ఉంటుందో?లేదో?’: ఎయిరిండియా విమానాల రద్దుపై ప్రయాణికుల ఆందోళన
-
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
-
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
-
‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
-
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్