21న నవీన్ ప్రభుత్వంపై భాజపా ఛార్జిషీట్
నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనా వైఫల్యాలకు సంబంధించిన ఛార్జిషీట్ సిద్ధం చేశామని, దీన్ని ఈ నెల 21న విడుదల చేస్తామని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ చెప్పారు.
భద్రక్లో మన్మోహన్కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న మహిళా మోర్చా కార్యకర్త
భువనేశ్వర్, న్యూస్టుడే: నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల పాలనా వైఫల్యాలకు సంబంధించిన ఛార్జిషీట్ సిద్ధం చేశామని, దీన్ని ఈ నెల 21న విడుదల చేస్తామని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ చెప్పారు. సోమవారం భద్రక్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఛార్జిషీట్ ప్రతి ఓటరుకు కార్యకర్తలు పంపిణీ చేస్తారన్నారు. మే మొదటి వారంలో రాష్ట్రానికి సంబంధించి మేనిఫెస్టో ప్రకటిస్తామని, ఈమేరకు రూపకల్పన జరుగుతున్నట్లు తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజిన్ పాలన తథ్యమని పునరుద్ఘాటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!