వారసులొచ్చారు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల రణంలో కుమారులు, భార్యలు
భువనేశ్వర్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు.
దంపతుల పోటీ
కనకవర్ధన్ సింగ్దేవ్ సంగీతాకుమారీ సింగ్దేవ్
బొలంగీర్ రాజు. మాజీ మంత్రి కనకవర్ధన్ సింగ్దేవ్ పాట్నాగఢ్ అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన భార్య, సిటింగ్ ఎంపీ సంగీతాకుమారీ సింగ్దేవ్ మళ్లీ బొలంగీర్ లోక్సభ అభ్యర్థిగా రంగంలో దిగారు.
తండ్రి ఒకటి తలస్తే...
సురేష్ రౌత్రాయి మన్మధ రౌత్రాయి
రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సురేష్ రౌత్రాయి పోటీ నుంచి తప్పుకొన్నారు. కుమారుడు మన్మధ రౌత్రాయిని జట్నీ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా చేయాలని భావించారు. మన్మధ బిజదలో చేరి భువనేశ్వర్ లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగారు. సురేష్ కుమారుని కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ ఆగ్రహానికి గురై పార్టీకి దూరమయ్యారు.
రంగంలో తండ్రీకుమారుడు
కేంద్ర మాజీ మంత్రి భక్త చరణదాస్ కలహండి జిల్లా నర్లా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కుమారుడు సాగర్ చరణ్ దాస్ భవానీపాట్నా శాసనసభకు అదే పార్టీ నుంచి తొలిసారిగా పోటీ చేస్తున్నారు.
తల్లి స్థానంలో కొడుకు
పరాజయం ఎరుగని గంజాం జిల్లా చికిటి రాణి, మంత్రి ఉషాదేవి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు చిన్మయానంద శ్రీరూప్దేవ్కు టికెట్ తెచ్చుకున్నారు. బిజద అభ్యర్థిగా బరిలో ఉన్న కుమారుడి విజయానికి రాణి ప్రచారం చేస్తున్నారు.
ఉప సభాపతి భార్యకు
అనుగుల్ నుంచి వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఉపసభాపతి రజనీకాంత్ సింగ్ ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన భార్య సంజుక్తా సింగ్ను ఈసారి బిజద తరఫున రంగంలోకి దించుతున్నారు.
ఈసారి సమరేంద్ర
రాష్ట్ర కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్న శాసనసభా పక్షం (సీఎల్ఫీ) నేత నర్సింగ మిశ్ర వయోభారం పెరిగినందన్న కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు సమరేంద్ర మిశ్రను బొలంగీర్ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టి, ఆయన విజయానికి కృషి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రమాదానికి గురైన విమానం
[ 01-05-2024]
భువనేశ్వర్ నుంచి దిల్లి బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది. బుధవారం మధ్యహ్నం 1.45 గంటలకు దిల్లి వెళ్లే విస్తార విమానం టేకాఫ్ అయిన పది నిమిషాల్లోనే అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకుని గాలి, వానతో వడగల్లు పడటంతో విమానం రెక్కలు విరిగాయి. -
విభేదాలను దాటి అధికారం ‘చే’ జిక్కించుకుంటారా?
[ 01-05-2024]
అంతర్గత కలహాలు, ముఖ్యనేతల మధ్య సమన్వయ లోపం, అభ్యర్థుల కొరత రాష్ట్రంలో కాంగ్రెస్ను వేధిస్తున్నాయి. ఎన్నికల ముందు, టికెట్ల కేటాయింపు సమయంలో పలువురు నేతలు బిజద, భాజపాల్లో చేరడంతో పార్టీకి దిశా నిర్దేశం చేసేవారి కొరత ఏర్పడింది. -
నామినేషన్ దాఖలు చేసిన నవీన్
[ 01-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గంజాం జిల్లా హింజిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. -
మృత్యువుతో పోరాడుతున్న మగుణి
[ 01-05-2024]
తోలు బొమ్మలాటలో దేశవిదేశాల్లో ఖ్యాతి గాంచిన కేంఝర్కి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి కుహర్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. -
కలిసొచ్చిన స్కూటర్... దూసుకుపోతా రయ్..రయ్
[ 01-05-2024]
వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్తో ఈసారి ప్రచారం ప్రారంభించారు. -
తండ్రి వెంట..కుమార్తె ప్రచారం ఇంటింట..
[ 01-05-2024]
బారాబటి కటక్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోఫియా ఫిర్దోస్ తండ్రి మహమ్మద్ ముఖింతో కలిసి మంగళవారం ప్రచారం ప్రారంభించారు. -
తెలుగులో పాట... ఓట్ల వేట
[ 01-05-2024]
పూరీ లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంబిత్ పాత్ర్ మంచి గాయకుడు. తెలుగు, ఒడియా, హిందీ గీతాలు పాడుతుంటారు. -
ఎన్నికల బరి... ఇంతులే మరి
[ 01-05-2024]
జిల్లాలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ రెండు పార్టీలు నారీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నాయి. -
తొలి ఓటు అనుభూతి పొందండి
[ 01-05-2024]
కొత్తగా ఓటు కార్డు పొందుతున్న యువ ఓటర్లు అందరూ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసి తొలి ఓటు అనుభూతి పొందాలని జిల్లా పాలనాధికారి మనోజ్ సత్యవాన్ మహాజన్ అన్నారు. -
చిట్ఫండ్ బాధితుల విషయమై నవీన్ ఎందుకు మాట తప్పారు?
[ 01-05-2024]
చిట్ఫండ్ బాధితులైన 20 లక్షల మందికి డబ్బు తిరిగి ఇప్పిస్తామన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎందుకు మాట తప్పారో, బాధితులను ఎందుకు నట్టేట ముంచారో సమాధానం చెప్పాలని భాజపా అధికార ప్రతినిధి సజ్జన్ శర్మ డిమాండ్ చేశారు -
చికిటిలో యాభై వేల మెజార్టీతో గెలిపించాలి: పాండ్యన్
[ 01-05-2024]
బ్రహ్మపుర లోక్సభ, చికిటి అసెంబ్లీ బిజద అభ్యర్థులు భృగు బక్షిపాత్ర్, చిన్మయానంద శ్రీరుప్ దేవ్లను శంఖద్వయం (జొడి శంఖొ) గుర్తుపై ఓటేసి గెలిపించాలని రాష్ట్ర 5టీ అధ్యక్షుడు వి.కార్తికేయ పాండ్యన్ ఓటర్లను కోరారు. నియోజకవర్గం పరిధిలో చికిటిపెంఠొలోని తళొబజారులో మంగళవారం సాయంత్రం ఎన్నికల బహిరంగ సభ నిర్వహించారు. -
జయపురం బరిలో 11 మంది అభ్యర్థులు
[ 01-05-2024]
జయపురం నియోజకవర్గంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. స్వతంత్ర అభ్యర్థి నీలమాధవ బిశోయి నామినేషన్ ఉపసంహరించుకోగా 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘విస్తారా’కు వడగండ్ల దెబ్బ.. విమానం అత్యవసర ల్యాండింగ్
-
కీర్తి సురేశ్తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి