logo

కలిసొచ్చిన స్కూటర్‌... దూసుకుపోతా రయ్‌..రయ్‌

వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్‌తో ఈసారి ప్రచారం ప్రారంభించారు.

Published : 01 May 2024 03:10 IST

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: వ్యవసాయ శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్‌ స్వయిన్‌కు ప్రతిసారి ఎన్నికల్లో కలిసొస్తున్న స్కూటర్‌తో ఈసారి ప్రచారం ప్రారంభించారు. కటక్‌ జిల్లా అఠాగఢ్‌ అసెంబ్లీ స్థానం నుంచి అయిదుసార్లు విజయం సాధించిన రాణేంద్ర ఆరోసారి బిజద అభ్యర్థి అయ్యారు. సోమవారం నామినేషన్‌ దాఖలు చేసిన ఆయన పాత స్కూటరుకు మరమ్మతులు చేయించారు. మంగళవారం నుంచి ఈ వాహనంలో ప్రచార యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా రాణేంద్ర విలేకరులతో మాట్లాడుతూ... మూడున్నర దశాబ్దాలుగా తన నివాసంలో ఉన్న ఈ స్కూటరు తనకు శుభాలు చేకూర్చినందున దీన్ని ఈసారి ఎన్నికల్లోనూ వినియోగిస్తున్నట్లు చెప్పారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని