నా ఓటు.. నా బాధ్యత
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
ఖరగ్పూర్:వీధి నాటికలో సన్నివేశం
ఖరగ్పూర్, గుణుపురం, రాయగడ, న్యూస్టుడే: నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కౌట్, గైడ్స్ ఫెలోషిప్ బృంద కళాకారులు మంగళవారం ఖరగ్పూర్లోని డేబ్రాలో ప్రదర్శించిన సందేశాత్మక వీధినాటిక ఆకట్టుకుంది. ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని గుణుపురం శత వృద్ధులు పిలుపునిచ్చారు. పట్టణంలో వంద సంవత్సరాలు దాటిన వృద్ధుడు గౌరీ చంద్ర పాఢి మాట్లాడుతూ స్వాతంత్య్ర నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నానని, ఈ ఏడాది కూడా ఓటు వేస్తానని అన్నారు. వృద్ధ మహిళ గుణమంజరి బెవర్తా మాట్లాడుతూ మన దేశంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బ్రహ్మపుర’ విజేత ఎవరు?
[ 04-05-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని బ్రహ్మపుర లోక్సభ స్థానం ప్రతిష్ఠాత్మకమైంది. -
నేడు జయశంకర్, రేపు నడ్డా, ఎల్లుండి ప్రధాని మోదీ రాష్ట్రానికి రాక
[ 04-05-2024]
విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ శనివారం రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. -
ఉమ్మర్కోట్లో విజయం ఎవరిదో?
[ 04-05-2024]
గత ఐదేళ్ల క్రితం వరకు బిజదకు కంచుకోటైన ఉమ్మర్కోట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు విజయం సాధిస్తారోనని ఉత్కంఠ నెలకొంది. -
కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదు: భట్టి
[ 04-05-2024]
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్రలు చేసి, పేద, బడుగు వర్గాల ప్రజల మనస్సులు దోచిన రాహుల్గాంధీ ప్రధాని కానున్నారని, కాంగ్రెస్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. -
సుజాతపై ఈసీ కొరడా
[ 04-05-2024]
మిషన్ శక్తి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సుజాత కార్తికేయన్ను ప్రజాసంబంధాలు లేని శాఖకు తక్షణం బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బిజదలో చేరిన జనా సామల్
[ 04-05-2024]
ఒడియా సినీనటి, భాజపా నేత జనా సామల్ శుక్రవారం ఆ పార్టీని వీడి బిజదలో చేరారు. -
నీరివ్వరా?.. ఓటు వేయం
[ 04-05-2024]
గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని రాయగడ సమితి లైలై పంచాయతీ ఖర్జీసాహి గ్రామస్థులు శుక్రవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. -
తెలుగులో ప్రచారం
[ 04-05-2024]
ఎన్నికల దగ్గర పడుతుండడంతో ప్రచారాల హోరు పెరిగింది -
చరవాణుల వెలుగులో అంత్యక్రియలు
[ 04-05-2024]
జయపురంలోని జయనగర్ ప్రాంతంలో ఉన్న భూత్నాధ్ శ్మశానంలో విద్యుత్తు దీపాలు లేకపోవడంతో చీకట్లోనే అంత్యక్రియలు జరుపుతున్న పరిస్థితి.
తాజా వార్తలు (Latest News)
-
రఫాపై దండయాత్ర జరిగితే..రక్తపాతమే: WHO ఆందోళన
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!