logo

నా ఓటు.. నా బాధ్యత

నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.

Published : 25 Apr 2024 03:52 IST

ఖరగ్‌పూర్‌:వీధి నాటికలో సన్నివేశం
ఖరగ్‌పూర్‌, గుణుపురం, రాయగడ, న్యూస్‌టుడే: నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు. పలు ప్రాంతాల్లో బుధవారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కౌట్‌, గైడ్స్‌ ఫెలోషిప్‌ బృంద కళాకారులు మంగళవారం ఖరగ్‌పూర్‌లోని డేబ్రాలో ప్రదర్శించిన సందేశాత్మక వీధినాటిక ఆకట్టుకుంది. ప్రతీ పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని గుణుపురం శత వృద్ధులు పిలుపునిచ్చారు. పట్టణంలో వంద సంవత్సరాలు దాటిన వృద్ధుడు గౌరీ చంద్ర పాఢి మాట్లాడుతూ స్వాతంత్య్ర నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నానని, ఈ ఏడాది కూడా ఓటు వేస్తానని అన్నారు. వృద్ధ మహిళ గుణమంజరి బెవర్తా మాట్లాడుతూ మన దేశంలో ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని