దక్షిణంలోనూ కమల వికాసం
రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు.
బిజదపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది: నడ్డా
గోపాల్పూర్లో అగ్రనేతలతో చర్చ
వేదికపై జె.పి.నడ్డా, విజయ్పాల్ సింగ్ తోమార్, లతా ఉసండె, బైజయంత్ పండా, బిప్లవ్ కుమార్ దేవ్, మన్మోహన్సామల్
గోపాలపూర్, న్యూస్టుడే: రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గోపాల్పూర్లో ఆయన గంజాం, గజపతి, కొరాపుట్, రాయగడ, నవరంగపూర్, మల్కాన్గిరి జిల్లాలకు చెందిన 200 మంది సీనియర్ నేతలతో చర్చించారు.
కలిసికట్టుగా శ్రమిస్తే...: 2019లో భాజపాకు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 38 శాతం ఓట్లు పోలయ్యాయని, అసెంబ్లీలో ఇది 32 శాతం అని వివరించిన నడ్డా భాజపా నేతలు ఈసారి కలిసికట్టుగా శ్రమిస్తే 45 శాతానికి మించి ఓటు బ్యాంకు దక్కించుకోవచ్చని, అధికారం చిక్కుతుందని వివరించారు.
మోదీ గ్యారంటీ తారక మంత్రం రావాలి..: దేశవ్యాప్తంగా మోదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇది రాష్ట్రంలోనూ కనిపిస్తోందని నడ్డా పేర్కొన్నారు. విశ్వసనీయతకు మరో పేరైన ప్రధాని గ్యారంటీ ప్రజల్లో నమ్మకం పెంచిందన్నారు. అన్నదాతలు, యువత, మహిళల ప్రయోజనాలతో కూడిన మోదీ గ్యారంటీని అందరికీ వివరించాలన్నారు. 24 ఏళ్ల నవీన్ పాలనా వైఫల్యాలపై రాష్ట్ర భాజపా రూపకల్పన చేసిన ఛార్జిషీట్ ప్రతి ఓటరుకు చేర్చాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం నామమాత్రమని, భాజపాకు ప్రత్యర్థి బిజదయేనని నడ్డా అభివర్ణించారు.
రాష్ట్రానికి ఎంతో చేశారు: ఒడిశాలో భాజపాయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా మోదీ అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. ఐఐఎం, ఐఐటీ, ఐజర్ తదితర ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర వర్సిటీలు ఏర్పాటయ్యాయని, రైల్వే రంగం విస్తరించిందన్నారు. నిధుల కేటాయింపులు పెరిగాయని, సద్వినియోగం చేసుకోవడంలో నవీన్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
దక్షిణ వాసుల్లోనూ నమ్మకం కుదిరింది..: దక్షిణంలో ఈసారి కమల వికాసం తథ్యమని, ఓటర్లు మార్పు కోరుతున్నారని నడ్డా చెప్పారు. రాష్ట్రాన్ని పాండ్యన్ పాలిస్తున్నారని, అధికారులు పెత్తనం చలాయిస్తున్నారని అందరికీ తెలిసింద]న్నారు. బ్రహ్మపుర, అస్కా, కొరాపుట్, నవరంగపూర్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 28 అసెంబ్లీ సీట్లలో 3/4 వంతు భాజపా ఖాతాలోకి వస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వల్ప ఘటనలు మినహా.. రెండో విడత ప్రశాంతం
[ 21-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారీ ధొళొ భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
మందకొడిగా ప్రారంభం... తర్వాత ఉత్సాహం
[ 21-05-2024]
గంజాం జిల్లాలో రెండోవిడత సోమవారం అస్కా లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగింది. -
నవీన్ పాలన రాష్ట్రానికి శాపం
[ 21-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి తీరని శాపమని, ఖనిజ సంపదలున్నా పేదరికానికి చిరునామా అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
కొరాపుట్లో భారీ వర్షం: ఇళ్లు ధ్వంసం
[ 21-05-2024]
కొరాపుట్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. -
ఉత్కళీయులు ఆశీర్వదిస్తున్నారు: మోదీ
[ 21-05-2024]
ఉత్కళీయులు ఈసారి భాజపాను ఆశీర్వదిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు కలగనుందని, జగన్నాథుని కటాక్షం పార్టీపై ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
మహానదితో కేంద్ర నేతల రాజకీయాలు: పాండ్యన్
[ 21-05-2024]
ఉత్తర కోస్తా, పశ్చిమ ఒడిశాలోని 15 జిల్లాలకు ‘జీవధార’గా నిలుస్తున్న మహానదితో కేంద్ర మంత్రులు దిగజారుడు రాజకీయాలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ ఆరోపించారు. -
ఎన్నికల బహిష్కరణ
[ 21-05-2024]
గంజాం జిల్లా సన్నొఖెముండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడియాపటనా గ్రామస్థులు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండు చేస్తూ సోమవారం ఎన్నికల్ని బహిష్కరించారు. -
జగన్నాథుని సన్నిధిలో మోదీ విశ్వశాంతి పూజలు
[ 21-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు పూరీ చేరుకున్నారు. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం..
[ 21-05-2024]
లక్షలాది రూపాయల నోట్ల కట్టలతో ఒక బ్యాగ్ లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ గదిలో రూ.500 నోట్ల కట్టలతో రూ.లక్షల నగదు ఆదివారం లభిచిందిత.
తాజా వార్తలు (Latest News)
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు
-
దోషులను తప్పించి... అమాయకులను ఇరికించి..!
-
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
-
ఉద్యోగుల భవన్ అమ్మేశారు.. నాలుగో తరగతి వేతనజీవుల ఆందోళన
-
అభ్యర్థుల నోటా.. ఆందోళన మాట