ముగ్గురు అభ్యర్థుల్ని మార్చిన కాంగ్రెస్
ఏఐసీసీ అధిష్ఠానం ఇదివరకు ఖరారు చేసిన 3 స్థానాల అభ్యర్థులను ఆదివారం మార్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా మార్పులు చేసిన నాయకత్వం వ్యవహారశైలి ఇతర అభ్యర్థులందర్నీ అసంతృప్తికి గురిచేస్తోంది.
దేవాశిష్ నాయక్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఏఐసీసీ అధిష్ఠానం ఇదివరకు ఖరారు చేసిన 3 స్థానాల అభ్యర్థులను ఆదివారం మార్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా మార్పులు చేసిన నాయకత్వం వ్యవహారశైలి ఇతర అభ్యర్థులందర్నీ అసంతృప్తికి గురిచేస్తోంది.
దేవాశిష్కు టికెట్
ఇటీవల బిజద, భాజపాలను వీడి శనివారం కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి దేవాశిష్ నాయక్కు ఆయన కోరుకున్న బొరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. నీలగిరిలో అక్షయ ఆచార్యను నిలిపారు. ఇదివరకు ప్రకటించిన దేవీప్రసన్న చాంద్ను జలేశ్వర్ నుంచి తప్పించి సుదర్శన్ దాస్కు టికెట్ కేటాయించారు. బొరిలో ఆరతిదేవ్ స్థానంలో దేవాశిష్ను, అఠామల్లిక్ బిజయానంద చౌలియాను తప్పించి హిమాంశు చేలియాను, అఠాగఢ్లో మోహబూబ్ అహమ్మద్ ఖాన్ స్థానంలో సుదర్శన్ సాహును, పూరీలో సుజిత్ మహాపాత్ర్ను తప్పించి ఉమావల్లబ్ రథ్ను అభ్యర్థులుగా చేశారు.
అభ్యర్థుల్లో అసహనం: ఈసారి 15 లోక్సభ, 90 అసెంబ్లీ సీట్లు కచ్చితంగా గెలుస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్న పీసీసీ నాయకత్వం స్థిర నిర్ణయంతో ముందుకు సాగడం లేదు. ప్రచారానికి ఇంతవరకు రూపాయి కేటాయించలేదని పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ నువాపడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. నర్లాలో కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్దాస్, భొండారి పొకరిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ అభ్యర్థులు. సీఎల్పీనేత నర్సింగ మిశ్ర కుమారుడు సమరేంద్ర మిశ్ర బొలంగీర్ అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కొడుకును గెలిపించుకోవడానికి నర్సింగ తన శక్తులన్నీ ఒడ్డుతున్నారు. కాంగ్రెస్లో కాస్తో, కూస్తో పలుకుబడి గల నేతలంతా తమ ప్రాంతాలకు పరిమితం కావడంతో మిగిలిన చోట్ల రంగంలో ఉన్న అభ్యర్థులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
[ 19-05-2024]
రాయగడ జిల్లా కాసిపూర్ సమితి పరిధిలో విద్యార్థుల మృతి ఘటనలకు సంబంధించి నలుగురు ఉపాధ్యాయులను విధుల నుంచి సస్పెండ్ చేశారు. -
పాతకక్షలతో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 19-05-2024]
పాతకక్షల నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
కమలమా.. శంఖమా ?
[ 19-05-2024]
పశ్చిమ ఒడిశాలోని బరగఢ్ లోక్సభ స్థానంలో ఎన్నికల వేడి పెరిగింది. భాజపా, బిజద అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోరు నువ్వా? నేనా? అన్న రీతిలో సాగుతోంది. -
రెండోవిడత ప్రచారానికి తెర
[ 19-05-2024]
అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లో 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమవారం (20న) రెండోవిడత పోలింగ్ జరగనుంది -
చివరి రోజు ముమ్మరంగా ప్రచారం
[ 19-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారానికి శనివారం చివరి రోజు కావడంతో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు -
ఈసారి కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు: సచిన్ పైలెట్
[ 19-05-2024]
ఈసారి దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నామని ఆ పార్టీ నేత సచిన్ పైలెట్ చెప్పారు. -
ప్రజాహితం కోరే సీఎం అవసరం: భజన్లాల్
[ 19-05-2024]
ఒడిశా ప్రజల హితం కోరే సీఎం రాష్ట్రానికి అవసరమని, నవీన్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్శర్మ చెప్పారు. -
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి: అశ్వినీ
[ 19-05-2024]
డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర ప్రగతి తథ్యమని, ప్రధాని మోదీ హయాంలో భారత్ అన్ని రంగాల్లో ముందంజ వేసినట్లు రైల్వే, కమ్యూనికేషన్, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. -
పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే
[ 19-05-2024]
ఆరుగాలం శ్రమించి పండించిన పంటను విక్రయించేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత రైతన్నలదేనని సహకార సంఘం డిప్యూటీ డైరెక్టర్ మన్మధకుమార్ దాస్ అన్నారు. -
బిజద పక్షానే రాష్ట్ర ప్రజలు: సీఎం
[ 19-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలపై ముఖ్యమంత్రి నవీన్ విమర్శలు గుప్పించారు. -
రాష్ట్రానికి మోదీ, రాజ్నాథ్, అమిత్షాల రాక
[ 19-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం రాత్రి భువనేశ్వర్ చేరుకోనున్నారు. 9 గంటలకు భాజపా అగ్రనేతలతో ఎన్నికల ప్రచార వ్యూహం, ఏర్పాట్లు పర్యవేక్షిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు