logo

17 క్వింటాళ్ల విప్పపువ్వు స్వాధీనం

ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నవరంగ్‌పూర్‌ జిల్లా కలెక్టర్ డా. కమల్ లోచన్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా అబ్కారీ అధికారి అభిరామ్ బెమెరా నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు.

Updated : 06 May 2024 16:56 IST

నవరంగ్‌పూర్‌: ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో నవరంగ్‌పూర్‌ జిల్లా కలెక్టర్ డా. కమల్ లోచన్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా అబ్కారీ అధికారి అభిరామ్ బెమెరా నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఉమ్మార్కెట్ సమితి తొటబెడ వద్ద సోమవారం అధికారులు తనిఖీలు చేస్తుండగా జోరిగావ్ సమితి మంచి అనుమానాస్పదంగా ఒక ట్రక్కును గుర్తించారు. ట్రక్కులో 17 క్వింటాళ్ల 500 కిలోలల విప్ప పువ్వును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని